టాలివుడ్ డ్రగ్స్ కేసు మొదలైనప్పటినుంచి ఎక్కువ బాణాలు ఎవరికి తగిలాయి అంటే అది దర్శకుడు పూరి జగన్నాథ్ కే.కెల్విన్ తో పూరి సంబంధాలు అంటూ మొదలైన అనుమానం ఈరోజు టాలివుడ్ డ్రాగ్ మాఫియా మొత్తాన్ని బయటకి లాగుతోంది.
అయినప్పటికీ తనకి కెల్విన్ ఎవరో తెలియదు, ఎప్పుడు కలవలేదు అంటూ విచారణలో చెప్పారు దర్శకుడు పూరి జగన్నాథ్.కాని ఈ స్టేట్మెంట్ కి వ్యతిరేకంగా ఓ పెద్ద సాక్ష్యం దొరికినట్టు సమాచారం.
కెల్విన్ అకౌంట్ లోకి ఓ సినీప్రముఖుడి అకౌంట్ నుంచి 1.30 కోట్లు ట్రాన్స్ ఫర్ అయినట్లు టాక్.ఈ డ్రగ్ డీలర్ కి అంత పెద్ద మొత్తం పంపించింది ఎవరో కాదు, పూరి జగన్నాథ్ అని ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఒకవేళ ఈ పని చేసింది నిజంగానే పూరి అయితే, ఈ టాప్ డైరెక్టర్ కి వ్యతిరేకంగా చాలా పెద్ద సాక్ష్యం దొరికేసినట్టే.
ఇప్పటికే పూరి జగన్నాథ్ హిట్ లిస్టులోకి చేరారు.కెమెరామెన్ శ్యాం కె నాయుడు అలాగే యాక్టర్ సుబ్బరాజు .ఇద్దరు కూడా పూరి జగన్నాథ్ డ్రగ్స్ సరఫరా చేస్తారని, అలాగే సొంతంగా తీసుకుంటారాని, టాలివుడ్ లో డ్రగ్స్, రేవ్ పార్టీల కల్చర్ ఇంతలా పెరగటానికి పూరి కూడా కారణమని చెప్పేశారు.కొత్తగా ఈ వార్త చక్కర్లు కొడుతోంది.
పూరికి వ్యతిరేకంగా ఛార్మీ, ముమైత్ ఖాన్, రవితేజల దగ్గరినుంచి కూడా సమాచారం రాబట్టవచ్చు అని భావిస్తున్నారు సిట్ అధికారులు.
విచారణ లిస్టులోకి చేరిన శ్యాం కె నాయుడు, సుబ్బరాజు, ఛార్మీ, ముమైత్ ఖాన్, రవితేజ … వీళ్ళంతా కూడా పూరి జగన్నాథ్ క్యాంప్ కి చెందినవారు, ఆ దర్శకుడి సన్నిహితులు కావడం విశేషం.
ఓవైపు ఇంతా జరుగుతున్నా, పూరి మాత్రం తన పని తానూ చేసుకుంటూ, బాలకృష్ణతో పైసా వసూల్ సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు.
భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ ఓ మాఫియా డాన్ గా కనిపించనున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన ఒక టీజర్ ఈ నెల 28న విడుదల కానుంది.ఇక సినిమా సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.