టాలీవుడ్ లో మాస్ పల్స్ ని బాగా పట్టిన దర్శకుడుగా పూరి జగన్నాథ్ కి మంచి పేరు ఉంది.అలాగే సాఫ్ట్ హీరోయిజంకి అలవాటు పడిన టాలీవుడ్ కి నెగిటివ్ హీరోయిజం పరిచయం చేసి, దాంతో ఆడియన్స్ ని కన్విన్స్ చేసి వరుస హిట్స్ కొట్టి స్టార్ దర్శకుడుగా పూరి జగన్నాథ్ తన బ్రాండ్ చూపించుకున్నాడు.
టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో కూడా సినిమాలు చేసిన పూరి జగన్నాథ్ ఒక్క చిరంజీవి, వెంకటేష్ తో మాత్రమే మిస్ అయ్యాడు.వీళ్ళతో కూడా సినిమాలు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు.
అయితే సరైన టైమింగ్ రాలేదు.అయితే పూరి జగన్నాథ్ కథలో హీరోయిజం ఉన్న ఒకే రకమైన కథలు మాఫియా చుట్టూ తిరుగుతూనే ఉంటాయనే విమర్శ ఉంది.
మాఫియా బ్యాక్ డ్రాప్ ని ధాటి అతను బయటకి రాలేకపోతున్నారు అనే విమర్శ కూడా ఉంది.అయితే విమర్శకుల నుంచి ఎలాంటి మాటలు వినిపించిన తన శైలిలోనే పూరి సినిమాలు చేస్తున్నాడు.
తాజాగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు.ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు.ఇది పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.ఈ సినిమాతో మళ్ళీ పూరి సక్సెస్ ట్రాక్ ఎక్కితే నెక్స్ట్ అతనితో చేయడానికి ఇద్దరు హీరోలు సిద్ధంగా ఉన్నారు.
వారిలో కింగ్ నాగార్జున ఒకరు, అలాగే పవన్ కళ్యాణ్ ఒకరు.ఇప్పటికే వీరిద్దరితో పూరి సంప్రదింపులు జరపడం, స్టోరీ లైన్ చెప్పి ఒకే చేయించుకోవడం కూడా జరిగిపోయిందని తెలుస్తుంది.
ఫైటర్ హిట్ అయితే వెంటనే కింగ్ నాగార్జునతో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే అవకాశం ఉంది.తరువాత పవన్ కళ్యాణ్ ఒక పేట్రియాటిక్ సినిమాని తన స్టైల్ లో పవన్ ఐడియాలజీ జోడించి తీయాలని అనుకుంటున్నారు.
ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు లైన్ లోనే ఉన్న వారితో సినిమా చేసే పరిస్థితి రావాలంటే ఫైటర్ తో పూరి కచ్చితంగా సూపర్ హిట్ కొట్టాల్సిందే.