టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఫైటర్ను శరవేగంగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముంబైలో జరుపుకుంటుండగా లాక్డౌన్ కారణంగా అది వాయిదా పడింది.
అయితే అనుకున్న దానికంటే ఎక్కువగా లాక్డౌన్ అమలులో ఉండటంతో ఈ సినిమా షూటింగ్ విషయంలో పూరీ అండ్ టీమ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ ప్రభావంతో విదేశాల్లో షూటింగ్లకు ఫిల్మ్ మేకర్స్ ఎలాగూ నో అంటున్నారు.
కానీ పూరీ ఇప్పుడు ముంబైలో కూడా షూటింగ్కు నో అంటున్నాడు.మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో అక్కడికి వెళ్లేందుకు పూరీ అండ్ టీమ్ డేర్ చేయరట.
అక్కడ షెడ్యూల్ చేసిన షూటింగ్ను కూడా హైదరాబాద్కు షిఫ్ట్ చేయాలని చూస్తున్నాడు.ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో పూరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఫైటర్ కోసం భారీ బడ్జెట్ను కేటాయించిన చిత్ర యూనిట్ ఎలాంటి రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు.దీంతో ముంబైలో ఫైటర్ షూటింగ్ను ఎట్టిపరిస్థితుల్లో నిర్వహించకూడదని పూరీ ఫిక్స్ అయ్యాడు.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తోండగా పూరీ కనెక్ట్స్పై చార్మీతో కలిసి పూరీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.హిందీ వర్షన్లో ఈ సినిమాను కరణ్ జోహర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.