టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించే సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో పూరీ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఎలాంటి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిందో అందరికీ తెలిసిందే.
కాగా ఈ సినిమా అందించిన హిట్తో ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.అయితే తన కొడుకు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ అనే సినిమాను పూరీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని వేసవి కానుకగా రిలీజ్కు రెడీ అయ్యింది.కానీ లాక్డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు పూరీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.అంతేగాక పూరీకి అదిరిపోయే ఆఫర్లు కూడా వచ్చినట్లు, అందుకే ఆయన ఓటీటీలో సినిమాను రిలీజ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆకాష్ పూరీ యాక్టింగ్ తనకు టర్నింగ్ పాయింట్గా మారనుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే తన కొడుకు కెరీర్ ఏమౌతుందో అనే భయం కూడా పూరీని వెంటాడుతోందట.
అందుకే ఈ విషయంపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది.ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోండగా పూరీ, ఛార్మి కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
మరి ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షమవుతుందో లేదో చూడాలి.