టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చేతిలో పలు ప్రాజెక్టులు ఉండగా కొత్త కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.తాను ఒకే చెప్పిన సినిమాలను వన్ బై వన్ షూటింగ్ పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు చిరంజీవి.
చిరంజీవి తాజాగా నటిస్తున్న సినిమాలలో గాడ్ ఫాదర్ కూడా ఒకటి.ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను దర్శక నిర్మాతలు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి ప్రేక్షకులకు నచ్చే విధంగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి మరీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అదేవిధంగా సత్యదేవ్, అనసూయ వంటి వారు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.ఇదిలా ఉంటే టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవలె ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించడానికి గాడ్ ఫాదర్ టీమ్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే.
ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటించబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల మేరకు గాడ్ ఫాదర్ సినిమాలో పూరి జగన్నాథ్ ఒక జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నారు అని సమాచారం మలయాళ వెర్షన్లో ఈ పాత్రను తెలుగులో ఎవరు చేస్తారా? అని ఆలోచించి పూరీని సంప్రదిస్తే ఆయన నటించడానికి ఓకే అన్నారు.సినిమాలో చిరంజీవి రైట్ హ్యాండ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అయినా సల్మాన్ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.సినిమాల విడుదల యాక్షన్ సన్నివేశాలతో పాటు ఒక సాంగ్ లో కూడా ఇద్దరు కలిసి నటించారు.
చిరంజీవి చెల్లెలు పాత్రలో నయనతార నటించింది.యాంకర్ అనసూయ కూడా సినిమాలో ఒక ప్రముఖ ఛానల్ అధినేత గా కనిపించబోతోంది.
అయితే ఈ సినిమాను ఆగష్టు 12 న విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.