ప్రెసెంట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ‘లైగర్’.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.
అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇదే కాంబో లో పాన్ రాబోతున్న విషయం విదితమే.
పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా జనగణమన సినిమా కూడా విజయ్ తోనే చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమా ప్రకటించారో లేదో సెట్స్ మీదకు తీసుకువెళ్లి ఫాస్ట్ గా పూర్తి చేయాలనీ పూరీ అన్ని పనులు పూర్తి చేస్తున్నాడు.లైగర్ విషయంలో కరోనా కారణంగా ఆలస్యం అవ్వడంతో ఈ సినిమా మాత్రం రెండు మూడు నెలల్లోనే పూర్తి చేయడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు.
అయితే తాజాగా ఈ సినిమా లో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ వార్త సారాంశం ఏంటంటే.పూరీ ఈమెకు ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా అందుకోనంత రెమ్యునరేషన్ ఈమెకు ఆఫర్ చేసాడట.ఎందుకంటే ఈ సినిమాలో ఈమె గ్లామర్ పరంగానే కాకుండా కీ రోల్ సన్నివేశాలు ఈమె పాత్ర చుట్టూ తిరుగుతాయట.
మరి పూరీ జగన్నాథ్ ఆఫర్ ను బుట్టబొమ్మ ఓకే చెబుతుందో లేదో చూడాలి.ఈ సినిమా పాన్ ఇండియన్ గా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రూపుదిద్దుకుంటుంది.సైనిక నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమా రిలీజ్ డేట్ సైతం పూరీ ఓపెనింగ్ రోజునే ప్రకటించాడు.ఈ సినిమా 2023 ఆగష్టు 3న రిలీజ్ చేయబోతున్నట్టు టైటిల్ పోస్టర్ లో తెలిపాడు.