టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్ధం’ ఎప్పుడో షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
కానీ వారి ఆశలపై కరోనా వైరస్ నీళ్లు జల్లింది.దీంతో ఈ సినిమా రిలీజ్ మళ్లీ వాయిదా పడింది.
అయితే ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని అందరూ అనుకుంటున్నారు.అయితే ఈ సినిమాను సైలెంట్గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం థియేటర్లు కూడా తెరుచుకునేందుకు సిద్ధమవుతుండటంతో నిశ్శబ్ధం చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రైవేటు స్క్రీనింగ్ను వేయగా దీన్ని క్రేజీ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్ తిలకించాడట.
ఇటీవల నిశ్శబ్ధం చిత్రం సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకోవడంతో ఈ సినిమాను వీలైనంత త్వరలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ సినిమా డైరెక్టర్ హేమంత్ మధుకర్ పూరీకి మంచి మిత్రుడు కావడం, అనుష్కను ఇండస్ట్రీకి పరిచయం చేసింది పూరీయే కావడం, ఇటీవల నిశ్శబ్ధం ట్రైలర్ను కూడా పూరీయే రిలీజ్ చేయడంతో ఈ సినిమా ప్రైవేటు స్క్రీనింగ్ను పూరీ కోసం వేశారట చిత్ర యూనిట్.
మొత్తానికి లాక్డౌన్ తరువాత రిలీజ్ కాబోతున్న తొలి సినిమాగా నిశ్శబ్దం నిలవనుంది.మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే అంశం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.