డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ మూవీ తెరకెక్కిస్తున్నారు.మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరిగింది.
అయితే కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటంతో షూటింగ్ వాయిదా వేసుకొని హైదరాబాద్ తిరిగొచ్చేశారు.మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది తెలియదు.
పూరీ కెరియర్ లో ఎక్కువ రోజులు షూటింగ్ దశలోనే ఉన్న సినిమా లైగర్ కావడం గమనార్హం.కరోన ఆటంకంతోనే ఈ సినిమా పదే పదే వాయిదా పడుతుంది.
కరణ్ జోహార్, చార్మీ సంయుక్తంగా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే మరో వైపు పూరీ తన తనయుడు ఆకాష్ ని హీరోగా నిలబెట్టడానికి చేసిన రొమాంటిక్ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిన దాని నుంచి ఎలాంటి అప్డేట్ బయటకి రావడం లేదు.
ఇదిలా పూరీ జగన్నాథ్ నెక్స్ట్ సినిమా గురించి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ న్యూస్ వినిపిస్తుంది.పూరీ నెక్స్ట్ యూత్ స్టార్ నితిన్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని టాక్ గట్టిగా వినిపిస్తుంది.
గతంలో పూరీ, నితిన్ కాంబినేషన్ లో హార్ట్ ఎటాక్ సినిమా వచ్చింది.అది ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది.అయితే ఈ సారి నితిన్ కి ఎలా అయిన హిట్ ఇవ్వాలని కసితో ఉన్నట్లు తెలుస్తుంది.ఇక నితిన్ కి జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు కూడా చెప్పుకుంటున్నారు.
అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని వీరిద్దరి కాంబినేషన్ లో తీయాలని పూరీ భావిస్తున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.