టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక రీసెంట్గా యంగ్ హీరో రామ్తో కలిసి ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్బస్టర్ను అందుకున్న పూరీ, తిరిగి సక్సెస్ ట్రాక్లోకి రావడంతో ఆయన తెరకెక్కిస్తున్న ఫైటర్ చిత్రంపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.
ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో విజయ్ దేవరకొండ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
అయితే గతంలో పూరీ అనౌన్స్ చేసిన ఓ సినిమాను ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందా అని చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు.గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు పోకిరి వంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్ అందించిన పూరీ, ఆ తరువాత బిజినెస్మెన్ చిత్రాన్ని తెరకెక్కించి మరో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.
ఇక ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ కావడంతో మహేష్తో జనగణమన అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కకుండానే ఆగిపోయింది.
ఇక అప్పటి నుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలుమార్లు చెప్పుకొచ్చిన పూరీ, ఆరు నూరైనా ఈ సినిమాను మహేష్తోనే తెరకెక్కిస్తానంటూ చెబుతున్నాడు.
మరి ఈ సినిమా ఎప్పటికైనా పట్టాలెక్కుతుందా లేదా అనేది మాత్రం కాలమే చెబుతుంది.