ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తూనే కొత్త ప్రాజెక్ట్స్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన మూడు కొత్త సినిమాలను ప్రకటించాడు.
ఒకటి తర్వాత మరొకటి స్టార్ట్ చెయ్యబోతున్నాడు.చిరంజీవి.
అయితే ప్రెసెంట్ చేస్తున్న ఆచార్య సినిమా దాదాపు పూర్తి అయ్యిందనే చెప్పుకుంటున్నారు.
అందుకే చిరంజీవి నెక్స్ట్ సినిమా గాడ్ ఫాదర్ ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాడు.
మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది అని వార్తలు వచ్చాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి సెట్స్ మీదకు తీసుకు వెళ్లినట్టు తెలుస్తుంది.అయితే తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఒక వార్త వినిపిస్తుంది.
ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పూరీ హ్యాండ్ కూడా ఉన్నట్టు సమాచారం.లూసిఫెర్ సినిమాలో మోహన్ లాల్ పాత్రను డిజైన్ చేసిన తీరు పూరీకి బాగా నచ్చిందట.
అందుకే ఆ విషయాన్ని చిరంజీవి తో చెప్పాడట.
అంతేకాదు చిరంజీవి ని ఈ సినిమాలో ఎలా చూపిస్తే బాగుంటుందో కొన్ని అభిప్రాయాలను కూడా తెలిపాడట.చిరంజీవి క్రేజ్ కు తగినట్టు కొన్ని సీన్స్ ను తెరమీద ఎలా చూపిస్తే బాగుంటుందో అలా మార్పులు చెప్పాడట.చిరంజీవి పూరీ చెప్పిన మార్పులు నచ్చడంతో స్క్రిప్ట్ చాలా వరకు పూర్తి అయ్యిన మార్పులు చేయించారట.
అందుకే గాడ్ ఫాదర్ సినిమాలో పూరీ జోక్యం ఉంటుందని అంటున్నారు.
ఇది ఇలా ఉంటే చిరంజీవి 150వ సినిమా పూరీ ‘ఆటో జానీ‘ పేరుతొ చెయ్యాల్సి ఉండగా సెకండ్ హాఫ్ కొద్దిగా ఇంట్రెస్ట్ లేదని పూరీ సినిమాను పక్కన పెట్టాడు.అయితే ఇప్పటికి కూడా పూరీ చిరంజీవి పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది.ఎలాగైనా పూరీ చిరంజీవి ని ఒప్పించాలని పట్టుదలతో ఉన్నాడు.
పూరీ టేకింగ్ ఎలా ఉంటుందో చిరంజీవికి బాగా తెలుసు.అందుకే పూరీకి ఒక అవకాశం ఇచ్చే సూచనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
మొత్తానికి పూరీ చెప్పిన మార్పులను చిరంజీవి ఒప్పుకోవడంతో ఈ సినిమాలో పూరీ జోక్యం ఉందని అంటున్నారు.