టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న పూరీ, మరోసారి తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ బాలీవుడ్లో రిలీజ్ చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే.దీంతో లైగర్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా ఈ సినిమా తరువాత పూరీ ఎవరితో సినిమా చేస్తాడనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
అయితే ఈ సినిమా తరువాత పూరీ తన నెక్ట్స్ చిత్రంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ను తెరకెక్కించాలని చూస్తున్నాడు.
ఈ క్రమంలో గతంలో మహేష్ బాబుతో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించాలని చూసినా, కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు.కాగా నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రాన్ని కూడా పూరీతో తెరకెక్కించాలని బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు కూడా జరుగుతున్నాయంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.దీంతో మోక్షజ్ఞ చిత్రానికే పూరీ ప్రాధాన్యతనిస్తాడని అందరూ అనుకుంటున్నారు.కానీ పూరీ మాత్రం జనగణమన చిత్రాన్ని ముందుగా తెరకెక్కించాలని చూస్తున్నాడట.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఈ చిత్ర స్టోరీలైన్ను వినిపించగా, ఆయన పూర్తి స్క్రిప్టును రెడీ చేయాల్సిందిగా కోరాడట.
బాలయ్య కొడుకు ప్రాజెక్టును పక్కనబెట్టిన పూరీ, జనగణమన చిత్ర స్క్రిప్టును పూర్తి చేసే పనిలో పడ్డాడు.దీంతో బాలయ్య కొడుకు ఎంట్రీని ఎవరు డైరెక్ట్ చేస్తారా అనే ఆసక్తి నందమూరి అభిమానుల్లో నెలకొంది.
ఇక పూరీ లైగర్ చిత్రానికి బ్లాక్బస్టర్ విజయాన్ని అందించేందుకు పూరీ తీవ్రంగా కష్టపడుతున్నాడు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తుండగా ఛార్మీతో కలిసి పూరీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.