సినిమా అనేది కేవలం కొంత మంది కల మాత్రమే కాదు.కొన్ని లక్షల మంది కాలక్షేపం.
జీవితంలో పరుగులు పెడుతున్న జనానికి కాస్తా రిలాక్షేసన్.ఆ రిలాక్స్ లేకపోతే లైఫ్ మొత్తం చాలా బోరింగ్ అయిపోతుంది.
ఒకప్పుడు జనాలకి వినోదం అందించడానికి నాటకం ఉంటే అది ఇప్పుడు సినిమాగా మారింది.అలాంటి సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆరు నెలల పాటు ఆగిపోయింది.
థియేటర్లు మూతపడ్డాయి.కొత్త సినిమా రిలీజ్ అయితే థియేటర్ల దగ్గర ఉండే సందడి మొత్తం మాయమైంది.
స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ చేసే సందడి కరువైంది.థియేటర్ లో సినిమా రిలీజ్ అయ్యి ఆరు నెలలు దాటిపోయింది.
థియేటర్ లో రిలీజ్అయ్యే సినిమా మీద ఆధారపడి ఒక థియేటర్ నిర్మాత నుంచి ఆర్టిస్ట్ లు, అలాగే థియేటర్ దగ్గర షాపులు పెట్టుకొని జీవితం నెట్టుకొచ్చే ప్రతి ఒక్కరు బ్రతుకుతూ ఉంటారు.ఈ కరోనా లాక్ డౌన్ థియేటర్లు మూతపడేలా చేసి చాలా మందికి ఫుడ్ లేకుండా చేసింది.
ఇలాంటి వాతావరణం నుంచి మళ్ళీ కోలుకొని థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి.సినిమా షూటింగ్ లు మొదలయ్యాయి.సినిమా రిలీజ్ లు మొదలవుతున్నాయి.అయితే ఒకప్పటి వాతావరణం థియేటర్లు ముందు ఉంటుందా లేదా అనేది ఓ పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు చెప్పలేం.
ఈ థియేటర్లు పరిస్థితి గురించి కన్నడంలో తీసిన ఓ సోషల్ మెసేజ్ షార్ట్ ఫిలిం స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ ని కన్నీళ్లు పెట్టించింది.దీంతో ఆ వీడియోని అతను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసి తన భావోద్వేగాన్ని అందరితో పంచుకున్నారు.
ఈ వీడియో చూసిన తర్వాత కళ్లలో నీళ్లు తిరిగాయని తెలిపారు.మళ్లీ ఆ రోజులు రావాలి, విజిల్స్ వేయాలి, పేపర్లు ఎగరాలి, చొక్కాలు చిరగాలి అని ఆకాంక్షించారు.
సినిమా థియేటర్ మన అమ్మ” అంటూ ఉద్వేగభరితంగా స్పందించారు.