సైబర్ పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ డైరెక్టర్ పూరి

చాలా గ్యాప్ తరువాత పూరి జగన్నాధ్, ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఒక చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.ఇస్మార్ట్ శంకర్ పేరు తో వస్తున్న ఈ చిత్రం స్టిల్స్ కూడా అదరగొడుతున్నాయి.

 Puri Jagannadh Approach To Cyber Police-TeluguStop.com

అయితే ఇవన్నీ పక్కన పెడితే పూరి ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది.తన కథను దొంగిలించారు అంటూ పూరి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మూవీ స్క్రిప్ట్ బజ్ బాస్కెట్ గ్రూప్ అడ్మిన్ మురళి కృష్ణ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి లీక్ చేసారు అంటూ సైబర్ పోలీసులను పూరి ఆశ్రయించారు.అయితే ఆ పోస్ట్ ని ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలగించాలని తమ టీమ్ కోరినప్పటికీ వారు తీయలేదని ఈ నేపథ్యంలో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినట్లు తెలిపారు.

అయితే కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

సైబర్ పోలీసులను ఆశ్రయించిన ప

రామ్ కధానాయకుడి గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన నభా పటేల్,నిధి అగర్వాల్ లు జోడి గా నటిస్తున్న సంగతి తెలిసిందే.పూరి కనెక్ట్ పతాకం పై ఛార్మి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించిన ప్రచార దృశ్యాలు ఆకట్టుకున్నాయి.దీనితో ఇస్మార్ట్ శంకర్ చిత్రం పై అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు.

అంతేకాకుండా ఈ చిత్రంలో రామ్ పాత్ర కూడా చాలా ఎనర్జిటిక్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.ఈ చిత్రం ఈ నెల 12 న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube