టాలీవుడ్ లో 2006వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి “పోకిరి” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అంతేగాక అప్పటికే సరైన హిట్ కోసం పరితపిస్తున్నటువంటి మహేష్ బాబుకి ఊపిరి పోసినట్లయింది.
అయితే ఆ తర్వాత మళ్లీ ఆరు సంవత్సరాల గ్యాప్ లో వీరిద్దరి కాంబినేషన్ లో 2012వ సంవత్సరంలో వచ్చినటువంటి బిజినెస్ మ్యాన్ చిత్రం కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.అయితే ఈ బిజినెస్ మ్యాన్ చిత్రంలో మహేష్ బాబు ట్రెండ్ సెట్ చేశాడు.
అయితే అజయ్ ఇంకా అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రాలేదు.దీంతో తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి సరిపోయే కథను సిద్ధం చేసినట్లు సమాచారం.
అంతేగాక ఈ కథను ఇప్పటికే మహేష్ బాబుకి వినిపించగా క్లైమాక్స్ కంటే ముందు వచ్చే కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేర్పులు చేయాలని మహేష్ బాబు పూరీ జగన్నాథ్ కి సూచించినట్లు తెలుస్తోంది.అందువల్లనే పూరి జగన్నాథ్ కొంత సమయం తీసుకొని కథలో మార్పులు చేర్పులపై దృష్టి సారిస్తానని మహేష్ బాబుతో చెప్పడం వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్టు తెలుస్తోంది.
అందువల్ల ప్రస్తుతం పూరి జగన్నాథ్ మహేష్ బాబు స్క్రిప్ట్ పనులని పక్కన పెట్టి ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండతో తెరికెక్కిస్తున్న “ఫైటర్” అనే చిత్రంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల పూరి జగన్నాథ్ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి మరో చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నట్లు పలు కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.అయితే ఈ విషయాలపై మాత్రం దర్శకుడు పూరి జగన్నాథ్ స్పందించడం లేదు.
.