టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ ప్రస్తుతం ముంబయిలో ఉన్నాడు.లైగర్ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు.
కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తున్న లైగర్ సినిమా ను మళ్లీ మొదలు పెట్టారు.సినిమా చివరి దశ చిత్రీకరణ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా విజయ్ దేవరకొండతో ఈ సినిమాను తీస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.భారీ అంచనాలున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్లుగా పూరి ప్రకటించాడు.
ముంబయిలో ఒక కుర్రాడు కలిసిన సమయంలో పూరి జగన్నాద్ లైగర్ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు.ముంబయి రోడ్డు మీద ప్రమోద్ అనే కుర్రాడితో పూరి జగన్నాద్ సాగించిన చిట్ చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోను ఛార్మి షేర్ చేసింది.
ఇన్ స్టా లో ఛార్మి షేర్ చేసిన వీడియోలో ప్రమోద్ అనే కుర్రాడు పూరి ని చూసి షాక్ అయ్యాడు.
సెల్ఫీ తీసుకోవాలంటే ఫోన్ లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.అతడికి పూరి అంటే చాలా ఇష్టం అని చెప్పాడు.తాను ఇంటర్ చదువుతున్నట్లుగా చెప్పిన ప్రమోద్ కు పూరిని చూసి నోట మాట రాలేదు.ముంబయి రోడ్డు మీద టీఎస్ రిజిస్ట్రేషన్ తో ఉంటే ఎవరో తెలుగు వారు అనుకున్నాను.
కాని మీరు ఉండటం చాలా ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.
అతడు సెల్ఫీ తీసుకోలేక పోయాడు.అందుకే ఆ వీడియోను షేర్ చేసినట్లుగా ఛార్మి పేర్కొంది.ఆ వీడియోను ప్రమోద్ గుర్తుగా ఉంచుకుంటాడు.
సెల్ఫీ తీసుకోలేక పోయాను అంటూ బాధ పడిన ప్రమోద్ కోసం ఈ వీడియో అంటూ ఛార్మి పోస్ట్ లో పేర్కొంది.మొత్తానికి ప్రమోద్ ను లక్కీ కుర్రాడు అంటూ అంతా కూడా అభినందిస్తున్నారు.
అదే సమయంలో లైగర్ సినిమా అప్ డేట్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.