డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇండస్ట్రీ హిట్స్ను ఎన్నో ఇచ్చిన విషయం తెల్సిందే.పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టకుండా తక్కువ బడ్జెట్తో భారీ విజయాలను తెరకెక్కించిన దర్శకుడు పూరి అత్యధిక చిత్రాలు చేసిన ఈతరం దర్శకుల్లో ఒక్కడిగా కూడా నిలిచిన విషయం తెల్సిందే.
ఎంతో జోరుగా సినిమాలను తెరకెక్కిస్తూ అందరి ప్రశంసలు దక్కించుకున్న పూరి గత అయిదు సంవత్సరాలుగా ఫ్లాప్లు తప్ప మరేం ఎరుగడం లేదు.మినిమం గ్యారెంటీ దర్శకుడు కాస్త ప్లాప్ చిత్రాల దర్శకుడిగా ముద్ర పడిపోయాడు.
పూరి దర్శకత్వంలో ఈమద్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్గా నిలిచాయి.పూరికి ఈమద్య కాలంలో ఛార్మి చాలా క్లోజ్గా ఉంటుంది.ఆయన సినిమాలకు సంబంధించిన ప్రతి విషయంలో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది.పూరి కాన్సెర్ట్ అంటూ ప్రారంభించిన పూరి దానికి పూర్తిగా ఛార్మినే బాధ్యురాలుగా నియమించాడు.ఆ బ్యానర్లో చిన్న విషయాల నుండి పెద్ద విషయాల వరకు ఛార్మి బాధ్యతలు చూసుకుంటుంది.ఆమద్య మెహబూబా సినిమాను అంతా తానై నడిపించింది.
కథ స్క్రీన్ప్లే విషయంలో కూడా ఛార్మి ఇన్వాల్వ్మెంట్ ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
పూరి దర్శకత్వంలో వస్తున్న సినిమాల విషయంలో ఆమె ఇన్వాల్వ్మెంట్ వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇంతగా ఫ్లాప్లు వచ్చినా కూడా ఆమెను మాత్రం వదలడం లేదు.
మెహబూబా చిత్రంను సొంతంగా నిర్మించిన పూరి ఆ సినిమా ఫ్లాప్తో తన ఇంటిని ఇతర ఆస్తులను కూడా అమ్మేసినట్లుగా తెలుస్తోంది.తాజాగా రామ్తో సినిమాకు సిద్దం అవుతున్న పూరితో ఛార్మి ఉంది.తాజాగా తీసుకున్న ఒక ఫొటోలో రామ్, పూరితో పాటు ఛార్మి కూడా ఉంది.
దాంతో ఈ ప్రాజెక్ట్లో కూడా ఆమె వేలు ఉంటుందని సోషల్ టాక్ వినిపిస్తుంది.ఇలా ఆమె ఇన్వాల్వ్మెంట్ వల్ల సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు విమర్శలు చేస్తున్నారు.