టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ హీరోయిన్ చార్మీని ఏకంగా నిర్మాతగా మార్చేశాడు.పూరీ కనెక్ట్స్ బ్యానర్ ఏర్పాటు చేసి దానికి మెయిన్ హెడ్ గా చార్మీని పెట్టాడు.
ఇక పూరీ జగన్నాథ్ తెరకెక్కించే అన్ని సినిమాలని ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచే నిర్మించేందుకు సిద్ధమయ్యారు.వేరే నిర్మాతల కంటే తన సొంత ప్రొడక్షన్ ద్వారానే సినిమాలు నిర్మించి లాభమో, నష్టమో తామే పొందాలని భావించారు.
ఇప్పటికే ఈ బ్యానర్ లో ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ హిట్ కొట్టిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ఫైటర్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
దీనికి కరణ్ జోహార్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.
ఇదిలా ఉంటే పూరీ కనెక్ట్స్ నుంచి వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తమ నిర్మాణ సంస్థ నుంచి రాబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చార్మీ ఓ వీడియో ద్వారా చెప్పుకొచ్చింది.
పూరీ కనెక్ట్స్ నుంచి భవిష్యత్తులో వచ్చే సినిమాలు అన్ని పాన్ ఇండియా రేంజ్ లోనే నిర్మిస్తామని చెప్పింది.ఇక తమ నుంచి వరుసగా ప్రాజెక్ట్ లకి సంబంధించి ప్రకటనలు ఉంటాయని, గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపింది.
అలాగే తమ నిర్మాణ సంస్థలో కొత్త టాలెంట్ నికూడా పరిచయం చేస్తామని స్పష్టం చేసింది.అలాగే వెబ్ సిరీస్ నిర్మాణంలోకి కూడా అడుగు పెడుతున్నట్లు, త్వరలో వాటికి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఉంటుందని తెలియజేసింది.
పూరీ జగన్నాథ్ నాలుగు నెలలగా కథలు రాస్తూ ఉన్నారని, మరో పదేళ్ల వరకు కథలకి ఎలాంటి కొదవ లేకుండా సాలిడ్ కంటెంట్ తమ దగ్గర ఉందని తెలియజేసింది.తాను ఇకపై పూర్తి స్థాయి నిర్మాతగానే కొనసాగుతానని, నటించే ఆలోచన లేదని స్పష్టం చేసింది.