పూరీ కనెక్ట్స్ నుంచి అన్ని పాన్ ఇండియా సినిమాలే అంటున్న చార్మీ

టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ హీరోయిన్ చార్మీని ఏకంగా నిర్మాతగా మార్చేశాడు.పూరీ కనెక్ట్స్ బ్యానర్ ఏర్పాటు చేసి దానికి మెయిన్ హెడ్ గా చార్మీని పెట్టాడు.

 Puri Connects All Future Projects Pan India Range, Tollywood, Telugu Cinema, Pur-TeluguStop.com

ఇక పూరీ జగన్నాథ్ తెరకెక్కించే అన్ని సినిమాలని ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచే నిర్మించేందుకు సిద్ధమయ్యారు.వేరే నిర్మాతల కంటే తన సొంత ప్రొడక్షన్ ద్వారానే సినిమాలు నిర్మించి లాభమో, నష్టమో తామే పొందాలని భావించారు.

ఇప్పటికే ఈ బ్యానర్ లో ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ హిట్ కొట్టిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ఫైటర్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

దీనికి కరణ్ జోహార్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

ఇదిలా ఉంటే పూరీ కనెక్ట్స్ నుంచి వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తమ నిర్మాణ సంస్థ నుంచి రాబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చార్మీ ఓ వీడియో ద్వారా చెప్పుకొచ్చింది.

పూరీ కనెక్ట్స్ నుంచి భవిష్యత్తులో వచ్చే సినిమాలు అన్ని పాన్ ఇండియా రేంజ్ లోనే నిర్మిస్తామని చెప్పింది.ఇక తమ నుంచి వరుసగా ప్రాజెక్ట్ లకి సంబంధించి ప్రకటనలు ఉంటాయని, గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపింది.

అలాగే తమ నిర్మాణ సంస్థలో కొత్త టాలెంట్ నికూడా పరిచయం చేస్తామని స్పష్టం చేసింది.అలాగే వెబ్ సిరీస్ నిర్మాణంలోకి కూడా అడుగు పెడుతున్నట్లు, త్వరలో వాటికి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఉంటుందని తెలియజేసింది.

పూరీ జగన్నాథ్ నాలుగు నెలలగా కథలు రాస్తూ ఉన్నారని, మరో పదేళ్ల వరకు కథలకి ఎలాంటి కొదవ లేకుండా సాలిడ్ కంటెంట్ తమ దగ్గర ఉందని తెలియజేసింది.తాను ఇకపై పూర్తి స్థాయి నిర్మాతగానే కొనసాగుతానని, నటించే ఆలోచన లేదని స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube