కన్నడ స్టార్ హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కేజీయఫ్ సిరీస్ సెకండ్ చాప్టర్ రూపొందుతుంది.కేజీఎఫ్ మొదటి పార్ట్ విజయం సాదించడంతో దానికి కొనసాగింపు గా సెకండ్ పార్ట్ ను తీస్తున్నారు.
ఈ చిత్రంలో శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.పాన్ ఇండియా చిత్రం గా భారీ బడ్జెట్ తో హెంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్త్ ఈ చిత్రంలో ఆధీర అనే పాత్రలో నటిస్తున్నాడు.యష్ ఈ చిత్రంలో రాకీ భాయ్ గా కనిపించనున్నాడు.
ప్రస్తుతం రాకీ భాయ్ కి ఆధీర కు మధ్య భీకరమైన యాక్షన్ ఎపిసోడ్ ను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
ఈ ఒక్క క్లైమాక్స్ సీన్ కోసం 12 కోట్ల వరకు దర్శకుడు నిర్మాతచే ఖర్చు పెట్టించాడు ఆంట.ఈ యాక్షన్ ఎపిసోడ్ తో షూటింగ్ పూర్తి అవ్వుతుంది.సమ్మర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ చిత్రంను తెలుగులో వారాహి చలన చిత్రం పై విడుదల అవ్వుతుంది.ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులను 60 కోట్లు పెట్టి కొంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
కన్నడ హీరో యష్ కి తెలుగులో అంత పెద్ద మార్కెట్ లేదు.మరి అంత మొత్తంలో పెట్టి కొనడం అంటే సాహసమానే చెప్పాలి 30 నుండి 40 కోట్లు వరకు పెట్టవచ్చు ఇది కూడా ఆయనకు చాలా ఎక్కువ ఓ సారి ఆలోచించుకొని కేజీఎఫ్ చాప్టర్ 2 హక్కులు కొనడం బెటర్ అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలకే బయట అంత మార్కెట్ లేదు ఓ కన్నడ హీరోని నమ్మి అంత రేట్ పెట్టి కొనడంపై ఓసారి ఆలోచించుకుంటే చాలా మంచిది.ఈ చిత్రంకు ఏ మాత్రం డివైడ్ టాక్ వచ్చిన కోలుకోలేని దెబ్బ పడుతుంది.కేజీఎఫ్ పై మరీ ఎక్కువ భారం పెడుతున్నారు కాస్త చూసుకోండి బాస్ అంటున్నారు.ఈ చిత్రంలో రవీనా టాండన్, రావు రమేష్,ఈశ్వరి రావు లు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి రవి బశ్రుర్ సంగీతం అందిస్తున్నాడు.
.