చంద్రబాబు ఆ డబ్బుకి లెక్కలు చెప్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోదీ సర్కారు ఏ విధంగానూ అన్యాయం చేయడం లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి వ్యాఖ్యానించారు.ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె, ఇప్పటివరకూ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రతి రూపాయికీ లెక్క చెప్పి ఆపై విమర్శలు చేయాలని చంద్రబాబునాయుడికి ఆమె హితవు పలికారు.

 Purandeswari Digs Chandrababu Naidu-TeluguStop.com

రాజధాని అమరావతి నిర్మాణం నిమిత్తం కేంద్రం ఇచ్చిన డబ్బుపై ఇప్పటికీ లెక్క చెప్పలేదని ఆమె విమర్శించారు.ఆ నిధులను పక్కదారి పట్టించారని పురందేశ్వరి ఆరోపించారు.

రాష్ట్రంలో లోటును పూడ్చడానికి కూడా కేంద్రం నిధులిస్తోందని ఆమె అన్నారు.మోదీ సర్కారు చేపట్టిన అభివద్ధి, సంక్షేమ పథకాలను, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు వివరించి చెబుతామని ఆమె స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube