కేంద్ర మాజీ మంత్రి … బీజేపీ నాయకురాలు దగ్గుపాటి పురందరేశ్వరి ఇప్పుడు రాజకీయంగా పెద్ద సవాల్ నే ఎదుర్కుంటున్నారు.ఆమె కుమారుడు హితేష్, భర్త వెంకటేశ్వరరావు వైసీపీలో చేరడం దాదాపు ఖాయం అవ్వడం… హితేష్ కు టికెట్ కూడా కన్ఫర్మ్ అయ్యింది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో… ఆమె ఇప్పుడు రాజకీయంగా అనేక విమర్శలు ఎదుర్కుంటున్నారు.
ఎందుకంటే వీరిద్దరూ వైసీపీలో చేరినా పురందరేశ్వరి మాత్రం బీజేపీలోనే ఉంటారని ఆమె భర్త ప్రకటించడం కలకలం రేపుతోంది.వైసీపీ – బీజేపీ రహస్య పొత్తుల ఒప్పందం కారణంగానే… వీరి కుటుంభం రెండు పార్టీల్లో కాళ్ళు పెట్టాలని చూస్తోందని వైసీపీ రాజకీయ విమర్శలు ప్రారంభించింది.
అంతే కాదు పురందరేశ్వరి పుల్లలు నివేదిత, హితేష్ చెంచురామ్.అసలు ఇండియన్ కాదు అన్న విషయం బయటకు వచ్చిన తర్వాత.అన్ని విషయాలు ఒక్క సారిగా.వెలుగులోకి వచ్చాయి.అసలు దగ్గుబాటి హితేష్ ఇండియన్స్ కాదు.పుట్టుకతోనే అమెరికన్స్.
అన్న విషయం విషయం హాట్ టాపిక్ అయింది.దగ్గుబాటి పురందేశ్వరి.
ప్రత్యేకంగా కాన్పు కోసమే.అక్కడికి వెళ్లి పిల్లల్ని కని .అక్కడి దేశ పౌరసత్వం తన పిల్లలకు ఇప్పించుకున్నారని.ఇదేమి నైతికత.
ఇదేమి జాతీయత.అనే విమర్శలు తీవ్రంగా వచ్చాయి.
ఉద్యోగం కోసమో.వ్యాపారం కోసమో.
అమెరికా వెళ్లి అక్కడి స్థిరపడి.పిల్లలు పుడితే.
అమెరికన్ పౌరసత్వం ఎంచుకోవడం.పెద్ద విషయమేం కాదు.
కానీ పురందేశ్వరి ప్రత్యేకంగా కాన్పు కోసమే వెళ్లినట్టు వస్తున్న వార్తలు మాత్రం ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఈ విమర్శల దాడి మరీ మితిమీరడంతో… ఆమె ఆత్మరక్షణలో పడిపోయారు.అందుకే… పుందేశ్వరి.ఎమోషనల్గా ఓ లెటర్ రాశారు.
నివేదిత, హితేష్ పుట్టడానికి ముందు తనకు ఇద్దరు పిల్లలను పుట్టక ముందే వారిని కోల్పోయానని.అందుకే తన తండ్రి ఎన్టీఆర్ బలవంతం మీద చికిత్స కోసం అమెరికా పంపించారని.
ఆ వివరణలో ఆవేదన వ్యక్తం చేశారు.వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని బాధపడ్డారు.
చికిత్స కోసం అమెరికా వెళ్లడం.జాగ్రత్త కోసం.అమెరికాలో చికిత్స చేయించుకోవడాన్ని ఎవరూ అభ్యంతరం పెట్టడం లేదు కానీ.కేవలం కాన్పు కోసం వెళ్లి అక్కడ.పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం ఆప్షన్ ఎంచుకోవడమే.అసలు విమర్శలకు కారణం అవుతోంది.
అమెరికాలో విదేశీ జంటలు.ఎవరికైనా జన్మనిస్తే.
పుట్టే బిడ్డకు ఏ దేశ పౌరసత్వం కావాలో.ఎంచుకునే అవకాశం ఉంటుంది.
కానీ ఇన్నిరకాల విమర్శల నేపథ్యంలో ఆమె మాత్రం అన్నిరకాలుగా అయోమయానికి గురవుతున్నట్టు కనిపిస్తోంది.