కేంద్ర మాజీ మంత్రి …బీజేపీ నాయకురాలు దగ్గుపాటి పురందేశ్వరి బీజేపీని వీడి వైసీపీలో చేరబోతున్నారు అనే వార్తల నేపథ్యంలో … ఆమె పార్టీ వీడకుండా ఉండేందుకు బీజేపీ ఆమెకు ఓ కీలక పదవిని కట్టబెట్టింది.ఆమె ప్రస్తుతం బీజేపీలో కీలక నాయకురాలిగా ఉన్నారు.
అయితే ఎన్నికల ముందు ఆమె కనుక పార్టీ మారిపోతే మరింత దెబ్బతింటుంది అనే ఆలోచనతో ఆమెకు ఎపి ఎన్నికల ప్రణాళిక కమిటీ చైర్ పర్సన్ గా పదవిని కట్టబెట్టింది.బిజెపి ఎపికి ఎలాంటి వాగ్దానాలు అమలు చేయాలన్నదానిపై ఈ కమిటీ అద్యయనం చేస్తుంది.
మాజీ సి.ఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఈ కమిటీకి కన్వీనర్ గా ఉంటారు.ఈ కమిటీలో ఉన్న సభ్యుల వివరాలు …
1.డి.పురందేశ్వరి(చైర్పర్సన్)
2.ఐవైఆర్ కృష్ణారావు(కన్వీనర్)
3.పి.విజయ బాబు
4.పీవీఎన్ మాధవ్
5.దాసరి శ్రీనివాసులు
6.షేక్ మస్తాన్
7.పాక సత్యనారాయణ
8.కె.కపిలేశ్వరయ్య
9.పి సన్యాసి రాజు
10.సుదీష్ రాంబోట్ల
11.డీఏఆర్ సుబ్రహ్మణ్యం.
తాజా వార్తలు