ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన భారత దేశం ప్రత్యేకంగా నిలబడడానికి కారణం మన సంస్కృతి సాంప్రదాయాలు.మన సంస్కృతి సాంప్రదాయాలను చూసి ముగ్దలవ్వని వారు ఉండరనే చెప్పవచ్చు.
మనం ప్రకృతి నుండి మొదలు పెట్టి పశు పక్షాదులను, తినే భోజనాన్ని పూజిస్తాం.ఎందుకంటే ప్రకృతి పూజించాల్సిన విశిష్టతను మన పూర్వీకులు నిర్దేశించారు.
అందుకే ఇప్పటికీ భోజనాన్ని మహా ప్రసాదంగా భావిస్తూ ఆరగిస్తారు.ఇంతటి గొప్ప సాంప్రదాయాలు మన భారత్ కు సొంతం.
అయితే ఇప్పుడిప్పుడే స్కూల్లలో భోజనం చేసేముందు విద్యార్థులకు భోజన విశిష్టతను తెలిసే విధంగా మంత్రాన్ని పటిస్తూ ఒక ప్రత్యేక కార్యాచరణను పొందుపరిచారు.కాని ఇటువంటి మంచి ఆచారాలను మనుషులమైన మనం మర్చిపోయాం.
కాని చిట్టి కుక్క పిల్లలు మన ఆచారాలను పాటిస్తున్నాయి.కుక్క పిల్లలు ఆచారాలను పాటించడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా.
అవును నిజమే.మీరిప్పుడు చూస్తున్న ఈ కుక్క పిల్లలు రోజూ తినే ముందు దేవుడికి పూజ చేస్తున్నాయి.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో నెటిజన్ల రకరకాల కామెంట్స్ తో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.నెటిజన్లను ఎంతో ఆసక్తికి గురి చేసిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.
ఇంకెందుకు ఆలస్యం.ఈ వైరల్ వీడియోను చూసేయండి మరి.