ఇటీవలే తెలుగు సినిమా పరిశ్రమలోని సమస్యలపై టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగా కొందరు తనపై కక్ష సాధింపుతో టికెట్ల రేట్లు పెంపు విషయంపై జోక్యం చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపాడు.
తాజాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై తెలుగు ప్రముఖ నటుడు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు దర్శకుడు పోసాని కృష్ణ మురళి సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.ఇందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి పదవీ బాధ్యతలు లేకపోవడంతో పెద్దగా అధికారాలు ఉండవని అలాంటప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో జరిగిన ఓ సమస్యను తన ముందు ఉంచుతున్నానని తెలిపాడు.
కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలని కూడా కోరాడు.
ఇందులో భాగంగా గతంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన హీరోయిన్ 17 సంవత్సరాల వయసులో హీరోయిన్ కావాలని ఎన్నో కలలతో, ఆశలతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పై ఉన్నటువంటి నమ్మకంతో ఇండస్ట్రీకి వచ్చిందని తెలిపాడు.
ఈ క్రమంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఆ సమయంలో సినిమా పరిశ్రమకి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యక్తి ఆ పంజాబ్ హీరోయిన్ ని లొంగదీసుకుని మాయమాటలు చెప్పి చివరికి గర్భవతిని చేసి వదిలేశాడని తెలిపాడు.అంతేకాకుండా హీరోయిన్ కి అబార్షన్ చేయించేందుకు దాదాపుగా 5 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు కూడా ముట్టచెప్పాడని దీంతో ఆ హీరోయిన్ చేసేదేమీ లేక తన జీవితాన్ని పాడు చేసినటువంటి ప్రముఖ వ్యక్తి పై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ వ్యక్తి ఇ తన పలుకుబడిని ఉపయోగించి హీరోయిన్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఈ సమస్య గురించి తాను కూడా ఇటీవలే విన్నానని కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
దీంతో దర్శకుడు పోసాని కృష్ణ మురళి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న అంతేకాకుండా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి చేతిలో మోసపోయినటువంటి ఆ పంజాబ్ హీరోయిన్ ఎవరు అనే విషయం పై నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వెతుకుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో “హరిహర వీరమల్లు” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ ఏడాది ఆరంభంలో “వకీల్ సాబ్” అనే చిత్రం లో హీరోగా నటించి మంచి హిట్ ని అందుకున్నాడు.దీంతో అదే ఊపు కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం దాదాపుగా రెండు చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు.