రావణ దహనం చూస్తుండగా దూసుకొచ్చిన రైలు ! 50 మంది మృతి

అమృత్ సర్ జోడా ఫాటక్ దగ్గర రావణ దహనంలో పెను విషాదం చోటు చేసుకుంది.రైల్వే ట్రాక్ పై నిలుచుని రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపై ట్రైన్ దూసుకెళ్లింది.

 Punjab Train Accident At Amruthsar 50 People Die-TeluguStop.com

ఈ ఘటనలో సుమారు 50 మంది దుర్మరణం పాలయ్యారు.వందలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే జోడా ఫాటక్ దగ్గర రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.దాదాపు ఏడు వందల మంది రైల్వే ట్రాక్ పై గుమ్మిగూడారు.

ఇంతలో రావణ విగ్రహానికి నిప్పు పెట్టడంతో బాణ సంచా పేలింది.ఆ సమయంలో పఠాన్ కోట నుంచి అమృత్ సర్ వెళ్తున్న డీఎంయూ ట్రైన్ నంబర్ 74943 వేగంగా దూసుకు వచ్చింది.

గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వేగంగా వస్తుంది.అయితే బాణ సంచా శబ్ధాలకు ట్రైన్ వస్తుందన్న విషయాన్ని ప్రజలు గమనించలేకపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube