దేశంలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్న వాటిలో వివాహేతర సంబంధం అనే చర్య పాత్ర కూడా ముఖ్యంగా ఉందన్న విషయం తెలిసిందే.ఇప్పటికి ఇలా వివాహేతర సంబంధం కొనసాగించడం పెద్ద అపరాధం.
చాలా తప్పు అని పవిత్రంగా జీవించాలని కోరుకునే వారు భావిస్తున్నారు.
కానీ మారిన మనషుల మనుసులకు మాత్రం ఇదొక ఎంజాయ్ అనే భావన, అంటే ఒంటి మీద దుస్తువులను మార్చినట్లుగా వివాహేతర సంబందాలను కొనసాగిస్తున్నారు.అయితే ఈ విషయంలో పంజాబ్-హర్యానా హైకోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది.ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల ఆమె భర్త వారి కూతురిని బలవంతంగా తీసుకెళ్లాదని కోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేసింది.
అయితే మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్నంత మాత్రాన ఆ మహిళను చెడిన తల్లిగా చిత్రీకరించలేమని తీర్పులో పేర్కొంటూ ఆ బాలికను తల్లికి అప్పగించాలంటూ ఆదేశించింది.అంతే కాకుండా హిందూ మైనార్టీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 లోని సెక్షన్ 6 ప్రకారం తల్లి సంరక్షణలోనే కూతురు అయిదేళ్ల వరకు పెరగాలని జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవల్ తన తీర్పులో పేర్కొన్నారు.