మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగించిన ఆ రాష్ట్రం

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి.లాక్ డౌన్ ఎంత కఠినంగా ఉన్నా కూడా కాంటాక్ట్ కేసుల సంఖ్య ప్రతి రోజు బయటపడుతూనే ఉన్నాయి.

 Lock Down Two Weeks Extend In Punjab, Corona Effect, Amarinder Singh-TeluguStop.com

చాలా మంది కరోనా లక్షణాలు ఉన్నా కూడా భయంతో బయటకి రాకపోవడంతో వారి ద్వారా చాలా మందికి కరోనా సోకుతుంది.ఈ నేపధ్యంలో ఇప్పటికే ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించే లాక్ డౌన్ గురించి చర్చించారు.

అయితే ఇప్పటికి చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగించాల్సిందే అని చెబుతున్నాయి.ఇక తాజాగా పంజాబ్ రాష్ట్రం మే మూడు నుంచి మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు.

అయితే ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు సడలిస్తామని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు.

ఆ సమయంలో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకోవచ్చని, దుకాణదారులు తమ షాపులను తెరుచుకోవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం లాక్‌డౌన్ కఠినంగా అమలవుతున్నప్పటికీ కొత్త కేసులు వెలుగు చూస్తుండడం పంజాబ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక ఇదే బాటలో ఓడిస్సా, తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా లాక్ డౌన్ పొడిగింపుకే ఆసక్తి చూపిస్తున్నారు. మరి దీనిపై వారు ఎలాంటి ప్రకటనలు చేస్తారు అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube