ప్రస్తుతం సౌత్ హీరోలు అందరూ యూనివర్శల్ కథలు పాన్ ఇండియా సినిమాల మీదనే దృష్టి పెట్టారు.నార్త్ ఇండియా ప్రేక్షకులు సౌత్ కథలని ఇక్కడి హీరోలని చూడటానికి ఇష్టపడటంతో మనవాళ్ళు కూడా ఆ అవకాశాన్ని ఒడిసిపట్టుకొని పాన్ ఇండియా కథలతో దేశ వ్యాప్తంగా తమ ఐడెంటిటి చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే తెలుగు స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ప్రభాస్, చిరంజీవి, లాంటి స్టార్స్ అందరూ పాన్ ఇండియా మార్క్ లోకి వచ్చేశారు.
ఇక తమిళ్ నుంచి ఇళయదళపతి విజయ్, సూర్య, ధనుష్, అజిత్ లాంటి స్టార్స్ అందరూ కూడా పాన్ ఇండియా కథలపై ఫోకస్ పెట్టారు.
ఇక కన్నడ నాట రాకింగ్ స్టార్ యష్ ఇప్పటికే కేజీఎఫ్ సినిమాతో జెండా ఎగరేసారు.ఇప్పుడు అతని రూట్ లో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా మరో అడుగు ముందుకి వేశారు.
ఇక కేజీఎఫ్ లాంటి సినిమాతో యష్ ని పాన్ ఇండియా హీరోని చేసిన హోంబలే ఫిలిమ్స్ నిర్మాత ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ ని ఇండియన్ వైడ్ గా పరిచయం చేయబోతున్నారు.
దీనికి సంబందించిన కొత్త ప్రాజెక్ట్ టైటిల్ తో సహా అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.లూసియా, యూటర్న్ లాంటి విభిన్న కథా చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు పవన్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది.ద్విత్వ అనే టైటిల్ ని అన్ని బాషలలో ఖరారు చేశారు.
ద్విత్వ అంటే ఒక వ్యక్తి రెండు రకాలుగా ప్రవర్తించడం అనే మీనింగ్ వస్తుంది.దీనిని బట్టి ఈ సినిమా కథాంశం కూడా సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఉంటుందని అర్ధమవుతుంది.
మొదటి రెండు సినిమాలతో థ్రిల్లర్ పాయింట్స్ తోనే తెరకెక్కించి హిట్ కొట్టిన పవన్ కుమార్ ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీకి కూడా అలాంటి కాన్సెప్ట్ నే ఎంచుకోవడం విశేషం.