కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడ సినీ పరిశ్రమను శోక సంద్రంలో మునిగి పోయింది.ఆయన మరణం అభిమానులతో పాటు సినీ ప్రముఖులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
టాప్ హీరోగా కొనసాగుతున్న పునీత్ గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈయన మరణ వార్త విన్న అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ఇంత చిన్న వయసులోనే మరణించడంతో అభిమానులంతా శోకసంద్రంలో మునిగి పోయారు.పునీత్ పార్ధివ దేహాన్ని చివరిసారిగా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు.లక్షలాది మంది అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో నిన్న ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పూర్తి అయ్యాయి.
ఈ విషయం అలా ఉండగా ఇప్పుడు కన్నడ అభిమానూలు తమిళ హీరోలపై ఫైర్ అవుతున్నారు.పునీత్ తెలుగు హీరో కాకపోయినా.తెలుగులో ఇప్పటి వరకు సినిమా చేయక పోయిన మన అని భావించి తెలుగు వాళ్ళందరూ ఆయన మరణ వార్త విని ఆవేదన చెందారు.
తెలుగు వాళ్ళ పునీత్ మరణం పట్ల స్పందించిన తీరుని కన్నడ ప్రజలు కొనియాడుతున్నారు.మన తెలుగు హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు బెంగుళూరు వెళ్లి మరి పునీత్ ను చివరిసారి చూసి నివాళులు అర్పించారు.
అయితే తమిళ హీరోలు మాత్రం ఒక్కరు కూడా రాలేదు.వారు స్పందించిన తీరు కూడా దారుణం అని తమిళ హీరోలపై కన్నడ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
తెలుగు సినిమాలు మాత్రమే కాదు తమిళ సినిమాలు కూడా కన్నడలో విడుదల అయ్యి బాగానే వసూళ్లు రాబడుతాయి.పునీత్ కూడా తమిళ స్టార్ల పట్ల తన అభిమానాన్ని పలుసార్లు చాటుకున్నారు.
ఇంత అనుబంధం ఉన్న కూడా తమిళ హీరోలు ఒక్కరంటే ఒక్కరు కూడా బెంగుళూరుకు వచ్చి చివరిచూపు చూడలేదని వారిపై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.తమిళ హీరోలను కన్నడలో బాయ్ కాట్ చేయాలనీ వారు డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.