కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం అభిమానులను ఎంతో బాధ పెట్టింది.పునీత్ మరణవార్తను విని తట్టుకోలేక ప్రాణాలను కోల్పోయిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు.
అప్పు లేరనే నిజాన్ని అభిమానులలో చాలామంది ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.సినీ ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
మరి కొందరు సోషల్ మీడియా వేదికగా పునీత్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు.
తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ పునీత్ రాజ్ కుమార్ లేరనే నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చారు.
పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు.తాజాగా హూట్ పేరుతో రజినీ గొంతుతో వినిపించే సోషల్ మీడియా యాప్ ప్రారంభమైంది.ఈ యాప్ ప్రమోషన్స్ సమయంలో రజినీకాంత్ పునీత్ ను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేయడం గమనార్హం.
అయితే పునీత్ మరణించిన సమయంలో కాకుండా ఇప్పుడు రజినీకాంత్ సంతాపం తెలియజేయడంపై పునీత్ అభిమానులు మండిపడుతున్నారు.
రజినీకాంత్ లాంటి లెజెండ్స్ యాప్ ప్రమోషన్స్ కొరకు సంతాపం తెలుపుతూ సందేశాలు ఇవ్వడం సరికాదని కొంతమంది చెబుతుంటే రజినీకాంత్ సంతాపం తెలుపుతున్నట్లు తనకు అనిపించడం లేదని యాప్ ప్రమోషన్ చేస్తున్నట్టు అనిపిస్తోందని మరి కొందరు నెటిజన్లు చెప్పుకొచ్చారు.
గత నెల 29వ తేదీన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన పునీత్ రాజ్ కుమార్ కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారు.వైద్యులు ఎంతో కష్టపడినా పునీత్ ప్రాణాలను కాపాడలేకపోయారు.పునీత్ స్పూర్తితో ఆయన అభిమానులలో చాలామంది నేత్ర దానం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
పునీత్ మరణించినా తమ హృదయాల్లో ఎప్పటికీ జీవించి ఉంటారని పునీత్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.పునీత్ చివరి సినిమా జేమ్స్ త్వరలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.