కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి అప్పుడే నెల రోజులు పూర్తి అయ్యింది.గత నెల 29వ తేదీ గుండెపోటుతో పునీత్ మరణించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇప్పటికీ ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు అతని మరణ వార్త నుంచి బయటపడలేక పోతున్నారు.ఇదిలా ఉండగా పునీత్ భార్య అశ్విని గురించి అందరికీ తెలిసిందే.
పునీత్ అశ్వినిల వివాహం 1999 డిసెంబర్ 1వ తేదీ జరిగింది.వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇలా ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన పునీత్ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా సాగిపోయింది.ఇలా ఇద్దరూ ఎంతో సంతోషంగా 21 సంవత్సరాలు వీరి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే వీరి 22 వివాహ వార్షికోత్సవం నిన్న జరగగా ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకోవడానికి పునీత్ మన మధ్య లేరు.ఇక నిన్న పునీత్ మ్యారేజ్ యానివర్సరీ కావడంతో ఎంతో మంది అభిమానులు ఈ విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డారు.ఇక బెంగళూరుకు వెళ్లిన అల్లు శిరీష్ పునీత్ కుటుంబాన్ని కలిసి వారిని పరామర్శించారు.అనంతరం మీడియాతో మాట్లాడిన శిరీష్ పునీత్ రాజ్ కుమార్ తో తనకున్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు.