కన్నడ స్టార్ హీరోలలో ఒకరైన పునీత్ రాజ్ కుమార్ ఫిజికల్ గా ఫిట్ గా ఉండటంతో ఉండటంతో పాటు ఎంతో యాక్టివ్ గా కనిపించేవారు.తరచూ వ్యాయామం, యోగా చేసే పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు రావడం గురించి నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది.
పునీత్ రాజ్ కుమార్ ఎన్నో కఠినమైన విన్యాసాలను కూడా చేసేవారు.లాక్ డౌన్ సమయంలో 2 నుంచి 3 కిలోల బరువు పెరిగిన పునీత్ లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత బరువు తగ్గే ప్రయత్నం చేశారు.
పునీత్ రాజ్ కుమార్ దృష్టిలో వర్కౌట్ చేయని పక్షంలో ఆరోజు వృథా అయిందని అర్థం.జిమ్ లోనే పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు రాగా రాజ్ కుమార్ కుటుంబానికి జిమ్ అచ్చిరాలేదనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.
గతంలో శివరాజ్ కుమార్ జిమ్ లో కసరత్తులు చేసే సమయంలోనే అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలిసిందే.పునీత్ రెండో సోదరుడు రాఘవేంద్ర జిమ్ చేసే సమయంలోనే పక్షవాతం బారిన పడ్డారు.
పునీత్ రాజ్ కుమార్ అభిమానులు తమ ఫేవరెట్ హీరో ప్రాణాలు కోల్పోయాడనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు.
పునీత్ తండ్రి రాజ్ కుమార్ చనిపోయిన సమయంలో ఆయన అభిమానులు బెంగళూరు నగరంలో విధ్వంసం సృష్టించారు.ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో మూడు రోజుల పాటు మధ్యపాన నిషేధం అమలవుతోంది.పునీత్ మరణ వార్త విని ఒక అభిమాని గుండెపోటుతో చనిపోయారు.
మునియప్ప అనే అభిమాని పొన్నాచ్చి తాలుకాలోని మరూరు ప్రాంతానికి చెందినవారు.ఈరోజు పునీత్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.పలువురు సినీ ప్రముఖులు పునీత్ అంత్యక్రియలకు హాజరు కానున్నారని తెలుస్తోంది.ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు రాజకీయ నాయకులు సైతం పునీత్ రాజ్ కుమార్ మృతికి సంతాపం తెలియజేశారు.