కరోనా దేశంలో మళ్లీ తిరగ బెడుతుంది.కేసుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్న తరుణం లో కోవిడ్ విజృంభించడం ఆందోళనకు గురిచేస్తుంది.
ఇకపోతే మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.
ఇక్కడ రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి.
ఈ క్రమం లో అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తగా పుణెలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలియ చేస్తుంది.ఈ కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు అమల్లో ఉంటుందని ఇక ఫిబ్రవరి 28 వ తేదీ వరకు అన్ని పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
కొత్త నిబంధనలను సోమవారం విడుదల చేస్తామని పుణె డివిజనల్ కమిషనర్ చెప్పారు.కాగా అత్యవసర సర్వీసులకు మాత్రం అనుమతి ఉంటుందన్నారు.
ఇక ప్రజలందరు విధిగా కరోనా నిబంధలను తూచ తప్పకుండా పాటించాలని, మాస్క్లు ధరించాలని, పేర్కొంటున్నారు.