తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్ పదో వారానికి చేరుకున్న సంగతి తెలిసిందే.షో చివరకు దశకు చేరవవుతున్న వేళ.
ప్రస్తుతం హౌస్లో ఉన్న లాస్య, అభిజిత్, హారిక, అఖిల్, మోనాల్, సొహైల్, మెహబూబ్, అవినాష్ మరియు అరియానాలు పోటా పోటీగా ఆడుతూ టైటిల్ దక్కించుకునేందుకు కృషి చేస్తున్నారు.ఇక ఈ వారం అరియానా, మోనాల్, అభిజిత్, మెహబూబ్, హారిక, సోహైల్లు నామినేషన్లో ఉన్నారు.
వీరిలో ఒకరు ఈ వారం దుకాణం సర్దేయన్నునారు.
ఇదిలా ఉంటే.
బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర ఎవరవుతారనే ఉత్కంఠ రోజురోజుకు పెరిగిపోతోంది.అయితే ఇలాంటి సమయంలో బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిసిపేట్ చేసిన పునర్నవి భూపాలం.
ఈ సీజన్ ఎవరు విజేత అవుతారనే దానిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.తాజాగా ఆమె మాట్లాడుతూ.
ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్లో అభిజిత్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పిన పున్ను.అతడే బిగ్ బాస్ నాల్గువ సీజన్ విన్నర్ అవుతాడని నేను భావిస్తున్నా అని చెప్పుకొచ్చింది.
అలాగే అవినాష్ కూడా తన ఫ్రెండే అని.అతడికి కూడా నా సపోర్ట్ ఉంటుందని పునర్నవి తెలిపింది.ఈ క్రమంలోనే హోస్ట్ నాగార్జునపై సైతం పునర్నవి కామెంట్లు చేసింది.సీజన్.సీజన్కు మార్పులు ఉంటున్నాయి.ఈ సీజన్లోనూ కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి అని చెప్పుకొచ్చిన పునర్నవి.
మూడు, నాలుగు సీజన్లకు నాగార్జున గారే హోస్ట్ కావడంతో ఆయన్ని చాలా మిస్ అవుతున్నా.ఆయన ఎవర్ గ్రీన్ కింగ్ అని తెలిపింది.
ఇక మొత్తానికి పునర్నవి కూడా అభిజిత్కే తన ఓటును వేసింది.కాగా, బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఇటీవల అభిజిత్నే గెలుస్తాడని జోష్యం చెప్పిన సంగతి తెలిసిందే.
అలాగే ఇంకొందరు కూడా అభిజిత్కే ఓటు వేస్తున్నారు.మరి ప్రేక్షకులు వీరి అంచనాలను నిజం చేస్తారా.లేదా.అన్నది త్వరలోనే తేలిపోనుంది.