జనసేనలో ఒక్కొక్కరుగా వచ్చి చేరుతున్నారు.ఇప్పటికే అనేకమంది ప్రముఖులతో చర్చలు జరిపిన నేపథ్యంలో ఒక్కో నేతను చేర్చుకుంటూ… వారికి కీలక పదవులు ఇస్తూ… మిగతా పార్టీలకు పవన్ ఝలక్ ఇస్తున్నాడు.తాజాగా… పులి శేఖర్ అనే ప్రవాసాంధ్రుడిని చేర్చుకున్న పవన్ … అతడికి వెంటనే… జనసేన పార్టీ వ్యవహారాల కేంద్ర కమిటీ చైర్మన్ గా నియమించేశారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… ప్రవాసాంధ్రునిగా ఉన్న పులి శేఖర్ వందల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాలు వదులుకుని మరీ జనసేనలో పని చేసేందుకు వచ్చారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఆశాజ్యోతి పథకం ద్వారా ఏటా 5 వేల మందికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న సాఫ్ట్వేర్ సంస్థల నిర్వహకులు శేఖర్ అని జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.మచిలీపట్నం నుంచి రెండు దశాబ్దాల కిందట ఆయన అమెరికా వెళ్లారని, ఆయన తాత నాయుడు నాగేశ్వరరావు స్వాతంత్య్ర సమరయోధులని పవన్ చెప్పుకొచ్చారు.