ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కరోనా గిఫ్ట్గా తీసుకున్న ఓ నాయకుని గురించిన వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న మాట.దేశంలో కరోనా వైరస్ ఎంత బలంగా మారి ప్రజల ప్రాణాలను తీస్తున్నా నేతలు మాత్రం తమ రాజకీయలబ్ధి కోసం ఎన్నికలంటూ, ప్రచారాలు, ప్రమాణాలంటూ తిరిగి కరోనా వైరస్ ను అంటించుకుంటున్నారు.
ఇలాగే పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ఎన్.రంగస్వామి నిన్న కరోనా బారినపడ్డారట.ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.ప్రస్తుతం సీయం ఎన్.రంగస్వామి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఇకపోతే శుక్రవారం ఆయనతో పాటుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన 11 మందికి కూడా కరోనా వైరస్ నిర్ధారణ జరిగినట్లుగా సమాచారం.ఇక పుదుచ్చేరి ముఖ్యమంత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.