మహేష్ బాబు 25వ చిత్రంగా వచ్చిన ‘మహర్షి’ చిత్రం విడుదలైన రోజు మిశ్రమ స్పందన దక్కించుకుంది.రివ్యూలు కూడా అంత గొప్పగా ఏమీ రాలేదు.
ఎక్కువ శాతం రివ్యూవర్స్ సినిమా యావరేజ్ అంటూ ఫైనల్ టాక్ ఇచ్చారు.ఇక ప్రేక్షకులు కూడా కాస్త మెసేజ్ ఓవర్ అయ్యిందని అనుకున్నారు.అయితే సినిమా ఇప్పుడు సాధిస్తున్న వసూళ్లు సంతృప్తికరంగానే ఉన్నాయి అనిపిస్తుంది.100 కోట్లు సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ దక్కించుకుంటుందని ముందు నుండి చెబుతున్న విషయం తెల్సిందే.అయితే మొదటి రోజు వచ్చిన స్పందనను బట్టి చూస్తే సినిమా అంత వసూళ్లు చేయగలుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.కాని సినిమాకు యూనిట్ సభ్యులు చేసిన ప్రచారంతో ఇప్పుడు అది సాధ్యం అయ్యేలా ఉంది.
సినిమా విడుదలైనప్పటి నుండి కూడా మహేష్బాబు మీడియా ముందే ఉంటున్నాడు.గతంలో ఏ సినిమాకు కూడా మహేష్ బాబు సినిమా విడుదల తర్వాత ఇన్ని సార్లు మీడియా ముందుకు రాలేదు.
వారం రోజుల్లో ప్రతి రోజు కూడా మీడియా ముందుకు రావడంతో పాటు, ఏదో ఒక కార్యక్రమంను చేస్తూనే ఉన్నారు.తాజాగా రైతులతో ఇంటర్వ్యూ అని, తర్వాత వ్యవసాయంపై అభిప్రాయం అంటూ అనేక ఈవెంట్స్ చేశారు.
తాజాగా ఆర్టీసి క్రాస్ రోడ్లో థియేటర్కు మహేష్ వెళ్లాడు.ఇలా మహర్షికి ఎక్కువ ప్రచారం చేస్తున్నారు.
పబ్లిసిటీ బాగా చేస్తున్న కారణంగా సినిమాకు రెండవ వారంలో కూడా మంచి కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు.
మహర్షి చిత్రం ఇప్పటికే 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను క్రాస్ చేసింది.ఇలాంటి సమయంలో 100 కోట్ల షేర్ను దక్కించుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.ఇంత వసూళ్లు దక్కించుకుంటున్న ఈ సినిమాకు చేస్తున్న ప్రమోషన్కు కూడా భారీగానే ఖర్చు పెడుతున్నట్లుగా తెలుస్తోంది.
కేవలం పబ్లిసిటీతోనే సినిమాను నెట్టుకు వస్తున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే కంటెంట్ లేకుంటే పబ్లిసిటీ ఎంత చేసినా కూడా ఫలితం ఉండదు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి మహర్షి చిత్రం 100 కోట్ల మార్క్ను చేరుకుందంటే అది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి.