ఏంటి మతి ఉండి మాట్లాడుతున్నారా? లేక మాట్లాడుతున్నారా అని అనుమానం మీకు వచ్చి ఉండచ్చు.కానీ నిజంగానే అక్కడ అద్దాల టాయిలెట్స్.
ఆ టాయిలెట్స్ కథ ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.సాధారణంగా పబ్లిక్ టాయిలెట్స్ అంటేనే పరిశుభ్రత గురించి.
ప్రైవసీ గురించి అలోచించి తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప వెళ్లం.
అలాంటిది అద్దాల పబ్లిక్ టాయిలెట్స్ అంటే మనం ఎవరం వెళ్ళాము.
కానీ ఇక్కడే ఓ స్పెషాలిటీ ఉంది.అది ఏంటంటే.
పబ్లిక్ టాయిలెట్ లో మనిషి లేకపోతే అవి అద్దాల లా కనిపిస్తాయి.అదే అందులో ఓ మనిషి వెళ్లి లాక్ చేసుకుంటే అద్దాలు కాస్త ఫుల్ బ్లర్ అయ్యి లోపల జరిగేది ఏది కనిపించదు.
ఈ సరికొత్త ఇన్నోవేషన్ జపాన్లోని షిబుయా జిల్లాలో చేశారు.పబ్లిక్ టాయిలెట్స్పై అవగాహన కల్పించి, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు పారదర్శక గాజుతో మరుగుదొడ్లను నిర్మించినట్టు అక్కడ అధికారులు చెప్పారు.
ఈ మరుగు దొడ్లపై మొదట కామెంట్లు చేసినప్పటికి ఆతరవాత ఈ మరుగుదొడ్లు బాగా ప్రసిద్ధి చెందాయి.ఈ మరుగుదొడ్లను యోయోగి ఫుకామాచి మినీ పార్క్, హారు-నో-ఒగావా కమ్యూనిటీ పార్కులలో ఏర్పాటు చెయ్యగా ఈ మరుగుదొడ్ల వల్ల ఆ పార్కుకే అందాన్ని తీసుకొచ్చాయి.