ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు.ఆ మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెల్సిందే.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆ మూడు సినిమాల విలువ వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందట.ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్ బాలీవుడ్ హీరోలను కూడా మించి పోతాడు అంటున్నారు.
ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాను ప్రభాస్ చేస్తున్నాడు.ఆ తర్వాత నాగ్ అశ్విన్ మరియు ఆదిపురుష్ సినిమాలను చేయబోతున్నాడు.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.అందువల్ల రాధేశ్యామ్ సినిమా కంటే ఆ రెండు సినిమాలకు ఎక్కువగా ప్రేక్షకులు ప్రాముఖ్యత ఇస్తున్నారు.
ఈ విషయంలో రాధేశ్యామ్ ను చిన్న చూపు చూస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.పైగా ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకుడు అవ్వడం వల్ల కూడా పెద్దగా జనాలు ఆసక్తి చూపడం లేదు.
ఆయన గత సినిమా నిరాశ పర్చడం వల్ల రాధేశ్యామ్ విషయంలో కాస్త తక్కువ ఆస్తక్తిగా కొందరు ఉన్నప్పటికి బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ప్రభాస్ ఏది చేసినా వందల కోట్లు కుమ్మరించేందుకు సిద్దంగా ఉన్నారు.రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెల్సిందే.
సినిమాకు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యి ఉండేది.కాని కరోనా కారణంగా ఇంకా చాలా బ్యాలన్స్ వర్క్ ఉంది.
అది ఎప్పటికి పూర్తి అయ్యేనో చూడాలి.వచ్చే నెల నుండి యూరప్ లో చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.
అతి త్వరలోనే సినిమా యూనిట్ సభ్యులు అక్కడకు చేరుకుని రెండు వారాల పాటు క్వారెంటైన్లో ఉండి ఆ తర్వాత షూటింగ్ను మొదలు పెట్టబోతున్నారు.యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను తెలుగు హిందీతో పాటు తమిళం, కన్నడం మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నారు.
సాహో సినిమాతో మరింత స్టార్ డంను దక్కించుకున్న ప్రభాస్ ఈ సినిమాతో అంతకు మించి స్టార్ అవుతాడని అంటున్నారు.దీనిని తక్కువ అంచనా వేస్తే ప్రేక్షకులు బోల్తా పడ్డట్లే.