తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం లోకి తెలుగుదేశం పార్టీ తరఫున టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రంగంలోకి దిగిపోయారు.పూర్తిగా ఇక్కడ లోక్ సభ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలనే పట్టుదలతో లోకేష్ ఉన్నారు.
ఇప్పటికే పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉన్నాము అంటూ టీడీపీ ప్రకటన చేయడంతో , పూర్తి ఫోకస్ అంతా తిరుపతి నియోజకవర్గం పైనే పెట్టారు.ఇక్కడ టీడీపీని గెలిపించి తన సత్తా చాటుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు.
నిన్న విస్తృతంగా తిరుపతి నియోజకవర్గంలో పర్యటించి, ప్రసంగించిన లోకేష్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది.దీంతో పాటు లోకేష్ ను ట్రోల్ చేస్తూ వైసీపీ, ఆపార్టీ అనుకూల సోషల్ మీడియా పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతోంది.
ఇక్కడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పనబాక లక్ష్మిని గెలిపిస్తే పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గిస్తామంటూ లోకేష్ వ్యాఖ్యానించడం పై ఆయన విమర్శలపాలు అవుతున్నారు.కేవలం ఒక ఎంపీ ని గెలిపిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ఏ విధంగా తగ్గుతాయని , వాటిని తగ్గించాలన్నా, పెంచాలన్న ఆ నిర్ణయం కేంద్రం తీసుకోవాల్సి ఉంటుందని, కానీ లోకేష్ కు ఈ విషయం కూడా తెలియదని , అందుకే ఇష్టమొచ్చినట్లుగా హామీలు ఇస్తూ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నాడు అంటూ ఆయనపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.
ఆదివారం సాయంత్రం వరదయ్యపాలెం లోకేష్ చేసిన ఈ ప్రసంగం పైన జనాల్లో చర్చ జరుగుతోంది.
ఏ విషయంపై ఏ విధంగా మాట్లాడాలి ? ప్రజలకు ఏ హామీ ఇచ్చి వారిని దగ్గర చేసుకోవాలనే విషయంలో లోకేష్ కు ఇంకా క్లారిటీ రాలేదని, అందుకే ఏదో ఒకటి అన్నట్లుగా మాట్లాడుతూూ, అభాసుపాలు అవుతున్నారు అనే చర్చ జరుగుతోంది.లోకేష్ పర్యటన వల్ల పార్టీకి అదనంగా కలిసి వచ్చేది లేకపోగా, అనవసరంగా నవ్వుల పాలవుతున్నాడు అనే అభిప్రాయము పార్టీ నేతల్లో నెలకొంది.ఇక ఏపీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై లోకేష్ ప్రసంగం లేకపోగా, పదేపదే వైసీపీని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారిని టార్గెట్ చేసుకుంటూ ఆయన మాట్లాడటం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.