పబ్జీ గేమ్ మాయలో పడి పిచ్చోడు అయినా కుర్రాడు..!

ఆన్ లైన్ గేమ్ పబ్జీ ఆటలో మునిగి ఓ కుర్రాడు ప్రాణాలు విడిచిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.ఆటకు బానిసైన ఆ యువకుడు భోజనం, నీళ్లు తాగడం కూడా మరిచిపోయాడు.

 Ap, West Godavari, Pubjee Game, Boy-TeluguStop.com

చివరకు ఆరోగ్య సమస్యలు తలెత్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పశ్చిమ గోదావరి జిల్లా జాజులకుంటకు చెందిన ఓ యువకుడు పబ్జీ గేమ్ కు బానిసయ్యాడు.

ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు అదేపనిగా ఆన్ లైన్ లో పబ్జీ ఆడుతూ కూర్చునే వాడు.చివరికి తిండి తినాలి, నీరు తాగాలనే విషయం కూడా మర్చిపోయాడు.

ఆట మత్తులో పడి అనారోగ్యానికి గురయ్యాడు.తల్లిదండ్రులు ఆ యువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పరీక్షించిన డాక్టర్లు షాక్ కి గురయ్యారు.

తిండి తినక, నీరు తాగక యువకుడి శరీరం డీహైడ్రేషన్ కి గురైందని, దీంతో పాటు డయేరియా బారిన కూడా పడ్డాడని వెల్లడించారు.

కాగా, ఆ యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు.కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంధ్రంలో మునిగారు.దేశవ్యాప్తంగా ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఈ గేమ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించినప్పటికి యువతలో మార్పు రావడంలేదని, ప్రభుత్వమే కఠిన నిర్ణయాలు తీసుకుని పబ్జీ వంటి ఆన్ లైన్ గేమ్ లను నిషేధించాలని పలువురు ఆరోపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube