బొమ్మల రామారంలో సంచలనంగా మారిన అమ్మాయిల మిస్సింగ్, హత్యలకి సంబంధించి సైకో శీను భాగోతాలు ఎంత సంచలనంగా మారాయో అందరికి తెలిసిందే.బొమ్మలరామారం పరిధిలో హాజీపూర్ లో బాలికల మిస్సింగ్ పాడుబడిన బావులలో మృతదేహాలు లభ్యమైన కేసు యావత్ రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.
మర్రి శ్రీనివాస్ రెడ్డి అనే సైకో హాజీపూర్ వెళ్లే బాలికలకు లిఫ్ట్ ఇచ్చి అత్యాచారం చేసి హత్యలు చేసినట్లుగా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.దీంతో అతని గురించి తెలిసిన ఘటనలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
అతని గత చరిత్ర కూడా ఇప్పుడు బయటకి వచ్చింది.
సైకో శ్రీను 2015లో ఓ యువతిపై లైంగిక దాడి చేశాడని, అప్పుడే గ్రామస్థులు చెట్టుకు కట్టేసి కొట్టారని, అప్పటి నుండే ఉన్మాదిగా మారి అత్యాచారం చేసి హత్యలు చేసి పాతిపెట్టేవాడన్నారు సీపీ మహేష్ భగవత్.
మొత్తం ఐదు హత్య కేసులలో శ్రీనివాస్ నిందితుడని బొమ్మలరామారం పరిధిలో హత్యలన్నీ ఒంటరిగానే చేశాడని, కల్పన, మనీషా, శ్రావణి హత్య కేసులలో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.ఇంకా అతని చేతిలో ఎంత మంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయాడో తెలుసుకునే ప్రయత్నం జరుగుతుందని సీపీ తెలియజేసారు.