సైకో శీను గురించి పోలీసులు చెప్పిన సంచలన నిజాలు

బొమ్మల రామారంలో సంచలనంగా మారిన అమ్మాయిల మిస్సింగ్, హత్యలకి సంబంధించి సైకో శీను భాగోతాలు ఎంత సంచలనంగా మారాయో అందరికి తెలిసిందే.బొమ్మలరామారం పరిధిలో హాజీపూర్ లో బాలికల మిస్సింగ్ పాడుబడిన బావులలో మృతదేహాలు లభ్యమైన కేసు యావత్ రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.

 Psycho Srinu Serial Murders Sensational In Telangana1-TeluguStop.com

మర్రి శ్రీనివాస్ రెడ్డి అనే సైకో హాజీపూర్ వెళ్లే బాలికలకు లిఫ్ట్ ఇచ్చి అత్యాచారం చేసి హత్యలు చేసినట్లుగా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.దీంతో అతని గురించి తెలిసిన ఘటనలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

అతని గత చరిత్ర కూడా ఇప్పుడు బయటకి వచ్చింది.

సైకో శ్రీను 2015లో ఓ యువతిపై లైంగిక దాడి చేశాడని, అప్పుడే గ్రామస్థులు చెట్టుకు కట్టేసి కొట్టారని, అప్పటి నుండే ఉన్మాదిగా మారి అత్యాచారం చేసి హత్యలు చేసి పాతిపెట్టేవాడన్నారు సీపీ మహేష్ భగవత్.

మొత్తం ఐదు హత్య కేసులలో శ్రీనివాస్ నిందితుడని బొమ్మలరామారం పరిధిలో హత్యలన్నీ ఒంటరిగానే చేశాడని, కల్పన, మనీషా, శ్రావణి హత్య కేసులలో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.ఇంకా అతని చేతిలో ఎంత మంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయాడో తెలుసుకునే ప్రయత్నం జరుగుతుందని సీపీ తెలియజేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube