మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో పవన్ మరియు రానా లు కలిసి నటిస్తున్నారు.వీరిద్దరి కాంబోలో మొదటి మూవీ అవ్వడం తో పాటు సూపర్ హిట్ మూవీకి రీమేక్ అవ్వడం వల్ల సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి.
అంచనాలకు తగ్గకుండా ఈ సినిమా ను సాగర్ చంద్ర దర్శకత్వం లో రూపొందిస్తున్నారు.త్రివిక్రమ్ ఈ సినిమా కు మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్న ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు డేట్ ఖరారు చేయబోతున్నారు.ఇప్పటికే 2021 లో ఈ రీమేక్ ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
కనుక ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ లో ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చెబుతున్నారు.
ఈ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో కూడా భారీ బిజినెస్ ను చేస్తోంది.
ఈమద్య కాలంలో ఓవర్సీస్ బిజినెస్ సరిగా లేదు.అక్కడ థియేటర్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు నడుస్తాయో ఎప్పటి నుండి ప్రేక్షకులు అక్కడ థియేటర్లకు క్యూ కడతారో తెలియదు.
అయినా కూడా ఈ రీమేక్ కు భారీ మొత్తంను ఆఫర్ చేసి ప్రముఖ పంపిణీ సంస్థ హక్కులను కొనుగోలు చేసింది.దాదాపుగా రూ.9 కోట్ల రూపాయలు చెల్లించి ఈ రీమేక్ ఓవర్సీస్ రైట్స్ ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.అక్కడ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.10 కోట్ల రూపాయలను వసూళ్లు చేయాల్సి ఉంటుంది.సినిమా పై ఉన్న క్రేజ్ నేపథ్యంలో సినిమా వసూళ్లు సాధించడం సాధ్యమే కాని అప్పటి వరకు అక్కడ మళ్లీ మునుపటి పరిస్థితులు ఏర్పడుతాయా అనేది చూడాల్సి ఉంది.