కొద్ది రోజుల క్రితం మిషన్ శక్తి ప్రాజెక్ట్ తో అంతరిక్షంలో శత్రు ఉపగ్రహాలని శాటిలైట్ ప్రయోగించి భారత్ కూల్చేసింది.ఈ మిషన్ శక్తి తో ప్రపంచ అగ్రదేశాల జాబితాలో భారత్ చేసింది.
ఇదిలా ఉంటె తాజాగా మరో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష కేంద్రం సిద్ధమైంది.ఉదయం 9 గంటల 27 నిమిషాలకు నెల్లూరు జిల్లా షార్ నుంచి PSLV -సీ 45 రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది.
ఓ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఉపగ్రహంతో పాటు మరో 28 విదేశీ శాటిలైట్లను PSLV -సీ 45 తీసుకెళ్తోంది.శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ PSLV -సీ 45 రాకెట్ ప్రయోగం జరుగుతుంది.
షార్లోని రెండో ప్రయోగ వేదికపై నుంచి PSLV -సీ 45ని ప్రయోగిస్తారు.ఇవాళ ఉదయం సరిగ్గా 9:27 గంటలకు PSLV -సీ నింగిలోకి ప్రవేశపెడతారు.PSLV -సీ 45 వాహక నౌక ద్వారా డీఆర్డీవో రూపొందించిన ఇమిశాట్తో పాటు 28 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ రాకెట్ లాంచింగ్ ని తొలిసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం సందర్శకులకి వచ్చింది.
సుమారు పదివేల మంది రాకెట్ ప్రయోగాన్ని అంతరిక్షం కేంద్రం వద్ద ఉన్న గాలరీ నుంచి చూడొచ్చు.