ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన పృథ్వీరాజ్ వైసీపీ తరపున పదవులు పొంది కొన్ని కారణాల వల్ల ఆ పదవులను కోల్పోయి సినీ కెరీర్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.తాజాగా పృథ్వీరాజ్ వైసీపీ గురించి షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేను జనసేనలో ఉండటం ఫిక్స్ అని పృథ్వీరాజ్ వెల్లడించడం గమనార్హం.
175కు 175 సీట్లు వస్తాయని వైసీపీ భావిస్తోందని 60 సీట్లు రావని గ్యారంటీ ఏంటని ఆయన కామెంట్లు చేశారు.
అలా చెప్పినంత మాత్రాన అన్నిసార్లు జరగవని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని పృథ్వీరాజ్ అన్నారు.వర్మ తీసే సినిమా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఏపీ ప్రజలు సున్నిత మనస్కులు అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.
పవన్ గురించి చెప్పాలంటే మూడు పెళ్లిళ్లు అని చెబుతారని ఆయన లీగల్ గా పెళ్లిళ్లు చేసుకుని విడిపోయారని ఆయన అన్నారు.పవన్ సంపాదన అంతా ట్యాక్స్ లు కడుతున్నారని ఆయన కౌలు రైతులకు డబ్బులు ఇవ్వడం విషయంలో హర్షించాలని పృథ్వీరాజ్ అన్నారు.
ప్రజలు కూడా అన్నీ గమనిస్తూ ఉంటారని ఆయన కామెంట్లు చేశారు.వచ్చే ఎన్నికల్లో పవన్ కు ఓటేస్తామని చేపలు పట్టేవాళ్లు తనతో చెప్పారని పృథ్వీరాజ్ అన్నారు.
చంద్రబాబు అనుకుంటే జగన్ పాదయాత్ర జరిగేదా అని ఆయన తెలిపారు.వైసీపీ పథకాలు గొప్పవని సినిమా తీస్తే తప్పు లేదని ఇతరుల గురించి తప్పుగా చిత్రీకరించడం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు.వర్మ తీసే సినిమా జనాల కోసం కాదని పృథ్వీరాజ్ అన్నారు.వర్మ సినిమాల వల్ల వోడ్కా బాటిల్స్ పెరగడం తప్ప అంతకు మించి ఎలాంటి బెనిఫిట్ ఉండదు అని పృథ్వీరాజ్ కామెంట్లు చేశారు.