ప్రస్తుతం 75 వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ఎంతో మంది సెలబ్రిటీలు హాజరై రెడ్ కార్పెట్ పై నడుస్తూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ తారలు ఐశ్వర్యరాయ్ దీపికా పదుకొనే ప్రియాంక చోప్రా వంటి సెలబ్రిటీ రెడ్ కార్పెట్ పై నడుస్తు సందడి చేశారు.అదేవిధంగా మన దక్షిణాది సినీ ఇండస్ట్రీ నుంచి పూజా హెగ్డే, తమన్నా ఈ అవకాశాన్ని అందుకున్నారు.
ఈ క్రమంలోనే ఈ సెలబ్రిటీలందరూ ప్రస్తుతం కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో సందడి చేస్తున్నారు.
ఈ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో భాగంగా తమన్నా ఇండియన్ డెలిగేషన్లో పాల్గొంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలిసారిగా భారత తరఫున కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో పాల్గొని రెడ్ కార్పెట్ పై నడవడం చాలా గర్వంగా ఉంది అంటూ తెలియజేశారు.సినీ ప్రపంచంలోని ఎంతో ప్రతిభావంతులు అంతా చిత్రోత్సవాలకు హాజరవుతారు.
అలాంటి చిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా గర్వంగా ఉంది అని తెలియజేశారు.ప్రస్తుతం ఈ 75వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్యారిస్ లో జరుగుతుంది.
ఈ చిత్రోత్సవాలు 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి ఈ నెల 28వ తేదీ వరకు జరుగుతాయి.ఈ చిత్రోత్సవాలలో రెండవ రోజులో భాగంగా సినీతారలు పెద్ద ఎత్తున సందడి చేశారు.కమల్ హాసన్, ఏఆర్ రెహమాన్, పూజా హెగ్డే, మాధవన్, శేఖర్ కపూర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు చిత్రోత్సవాల్లో సందడి చేశారు.ఇకపోతే లెజెండరీ నటుడు కమల్ హాసన్ ఈ వేదికపై తాను నటించిన విక్రమ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఈ వేదికపై నుంచి నిర్వహించారు.