పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాల్లో నటించే అవకాశం లేదని అంతా అనుకున్నారు.ఆయన రాజకీయాలతో బిజీ అయ్యాడు.
దాంతో ఆయన సినిమాలకు ఒప్పుకోక పోవచ్చు అంటూ అంతా భావించారు.కాని అనూహ్యంగా ఆయన బాలీవుడ్ హిట్ మూవీ పింక్ ను రీమేక్ చేసేందుకు మొదట ఓకే చెప్పాడు.
పింక్ అనేది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ.ఆడవారి సమస్యల నేపథ్యంలో సాగే సినిమా.
ఆడవారికి అండగా ఉండే ఒక లాయర్ కథే ఈ సినిమా అనే విషయం తెల్సిందే.అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం కాస్త ఈ సినిమాకు కమర్షియల్ టచ్ ఇవ్వడం జరిగింది.
బాలీవుడ్ పింక్ కు వకీల్ సాబ్ కు మార్పులు చేర్పులు బాగానే ఉన్నాయి అంటున్నారు.అయినా కూడా ఇంకా సినిమాపై అంచనాలు పెంచే విధంగా ప్రమోషనల్ సాంగ్ ను తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు.
ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆ ప్రమోషనల్ సాంగ్ లో మెగా హీరోలు ఇద్దరు లేదా ముగ్గురు కనిపించబోతున్నారు.అలాగే హీరోయిన్స్ నలుగురు అయిదుగురు కనిపించబోతున్నారని సమాచారం అందుతోంది.
థమన్ చాలా స్పెషల్ గా ఆ ప్రమోషనల్ సాంగ్ ను ట్యూన్ చేశాడనే వార్తలు వస్తున్నాయి.దానికి తగ్గట్లుగా దర్శకుడు వేణు శ్రీరామ్ భారీ స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడు.
సినిమా విడుదల రెండు వారాలు ఉండగా ఈ పాటను విడుదల చేసి అన్ని మీడియా ప్లాట్ ఫామ్ ల్లో తెగ హడావుడి చేయబోతున్నారు.ఈ పాటతో సినిమా పై అంచనాలు ఆకాశానికి తీసుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
అతి త్వరలోనే ఈ పాటకు సంబంధించిన అప్ డేట్ ను థమన్ ఇవ్వబోతున్నాడట.ఈ సినిమా లో పవన్ కు జోడీగా శృతి హాసన్ నటించగా కీలక పాత్రల్లో అంజలి మరియు నివేథా థామస్ కనిపించబోతున్నారు.