హైదరాబాద్ నాగోల్ మహాదేవ్ జ్యువెలరీ కాల్పుల కేసులో పురోగతి లభించింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా ఓ దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సీసీ కెమెరాల లైవ్ ట్రాకింగ్ ద్వారా దోపిడీ చేసి పారిపోతున్న దుండగుడిని అరెస్ట్ చేసారు.
అదేవిధంగా మహారాష్ట్రలో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.జ్యువెలరీ షాపులో చోరీకి పాల్పడిన నిందితులు ఇద్దరిపై కాల్పులు జరపగా వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.