హ్యాండ్ సమ్ హీరో నాగ శౌర్య ఈ మధ్య కాలంలో కమర్షియల్ హీరోగా మారడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.రొమాంటిక్ లవ్ స్టోరీస్ పక్కన పెట్టి యాక్షన్ లోకి దిగి తన మార్కెట్ పెంచుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
తన సొంత ప్రొడక్షన్ లో తెరకెక్కించిన అశ్వద్ధామ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.అయిన కూడా నాగ శౌర్యకి అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి.
నందిని రెడ్డి తన నెక్స్ట్ సినిమాని నాగ శౌర్యతోనే చేయడానికి రెడీ అవుతుంది.దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా జారిపోయింది.
మరో వైపు ఈ కుర్ర హీరో కొత్త దర్శకులతో కమర్షియల్ కథలకి ఒకే చెబుతున్నాడు.తాజాగా సంతోష్ జాగర్లమూడి అనే యువ దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ సినిమాని నారాయణ దాస్ నారంగ్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు.
ఇక ఈ సినిమాకి సంబందించిన పూజా పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.
రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళాల్సి సమయంలో లాక్ డౌన్ రావడంతో వాయిదా పడింది.అయితే లాక్ డౌన్ ఎప్పటికి పూర్తవుతుందో, మరల సినిమాలకి ఎప్పటికి పర్మిషన్ ఇస్తారో తెలియని పరిస్థితి.
ఈ నేపధ్యంలో ఇప్పటికే వ్యాపారాలు పడకేసి ఉండటంతో నష్టాలలో ఉన్న నిర్మాతలు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్టుగా చెబుతున్నారు.వ్యాపారాలు అన్ని కోలుకున్న తర్వాత మరల మరల ఇండస్ట్రీ పరిస్థితి చూసుకొని సినిమాలపై దృష్టిపెట్టాలని నిర్మాతలు భావించడంతో ఈ సినిమా ఆగినట్లు టాక్ వినిపిస్తుంది.
అయితే దర్శకుడు సంతోష్ మాత్రం వేరొక నిర్మాతలని వెతుక్కునే పనిలో పడ్డాడని సమాచారం.