దర్శక దిగ్గజం శంకర్ కి ఈ మధ్య రోజులు అంతగా భాగోలేనట్లు ఉన్నాయి.భారీ బడ్జెట్ తో ఇండియన్ సినిమా సీక్వెల్ స్టార్ట్ చేస్తే దానికి మొదటి నుంచి ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి.
చివరికి సెట్ లో ప్రమాదం జరిగి ఇద్దరు అసిస్టెంట్ లు కూడా చనిపోయారు.తరువాత కరోనాతో షూటింగ్ వాయిదా పడిపోయింది.
నిర్మాతలు సినిమా షూటింగ్ విషయంలో ముందుకి కదలకుండా ఆపేశారు.దీంతో ఆ సినిమా పక్కన పెట్టి రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేసుకున్నాడు.
అయితే సడెన్ గా ఇండియన్ 2 నిర్మాతలైన లైకా ప్రొడక్షన్ శంకర్ మీద కోర్టులో కేసు వేశారు.తమ సినిమా పూర్తి కాకుండా వేరొక సినిమా చేయకూడదని కండిషన్ పెట్టారు.
ఈ కేసు అలా నడుస్తుంది.అయితే రెండు రోజుల క్రితం బాలీవుడ్ లో రణవీర్ సింగ్తో అపరిచితుడు రీమేక్ ని శంకర్ ఎనౌన్స్ చేశాడు.
ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు.అయితే ఇప్పుడు అపరిచితుడు ఒరిజినల్ నిర్మాత అయిన ఆస్కార్ రవిచంద్రన్ వెంటనే లైన్ లోకి వచ్చాడు.
ఆ సినిమాకి సంబంధించి సర్వ హక్కులు తనకే ఉన్నాయని, తాను రైటర్ నుంచి అపరిచితుడు సినిమా హక్కులు పూర్తిగా కొనుక్కున్నానని.తనని సంప్రదించకుండా రీమేక్ సన్నాహాలు చేస్తే కోర్టుకి వెళ్తానని శంకర్ కి మెయిల్ చేశాడు.దీనిపై శంకర్ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు.అపరిచితుడు కథ, స్క్రీన్ ప్లే పూర్తిగా నావి.కేవలం సుజాత అనే వ్యక్తి మాటల వరకే పరిమితం.తన సినిమాని తాను రీమేక్ చేసుకుంటే మీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలంటూ రివర్స్ అయ్యాడు.
నా ప్రాజెక్ట్ ద్వారా గుర్తింపు పొందాలనే మీ ప్రయత్నం ఆపుకోండి.కోర్టుకి వెళ్తానని చెప్పి బెదిరించే ప్రయత్నం చేయకండి అంటూ ఘాటుగా ఓపెన్ లెటర్ రాశాడు.
మరి ఈ వివాదం ఇద్దరి మధ్య ఎంత వరకు వెళ్తుందనేది ఇప్పుడు కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.