గత సంవత్సరంలో ప్రముఖ టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ నటించిన టువంటి చిత్రం రాక్షసుడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు.
ఈ చిత్రం గత సంవత్సరంలో ఆగస్టు 2వ తారీఖున విడుదలయింది.భారీ అంచనాల నడుమ విడుదలైన టువంటి చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
అంతేకాక దర్శక నిర్మాతలకు మంచి కాసుల వర్షం కురిపించింది.అయితే ఈ చిత్రంలో తమిళ నటుడు శరవణన్, అమ్ము అభిరామి, వినోదిని, అభిరామి, కేశవ్ దీపక్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే ఈ చిత్రం మంచి హిట్ అయి దర్శక నిర్మాతలకు మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు లాభాల వచ్చినందువల్ల దర్శకుడు రమేష్ వర్మకి ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి నిర్మాత సత్యనారాయణ కోనేరు ఖరీదైన ఓ భవనాన్ని బహుమతిగా ఇచ్చాడు.అయితే ఈ భవంతి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యన్న పెరల్ లో ఉన్నటువంటి ఓ భవంతిని దర్శకుడికి బహుమతిగా అందించారు.
ఈ భవనం దాదాపుగా 3 కోట్ల రూపాయలకి పైగా విలువ చేస్తుంది. దీంతో దర్శకుడు రమేష్ వర్మ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రమేష్ వర్మ తన కెరియర్ లో వీర, రైడ్, మల్లెపువ్వు, వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను కూడా అందించాడు.అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి జఫ్ఫా, అబ్బాయితో అమ్మాయి, 7, చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో రమేష్ వర్మ జోరు తగ్గినప్పటికీ రాక్షసుడు సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లో పడ్డాడు.అయితే ప్రస్తుతం తన తదుపరి చిత్రం కూడా ఓ స్టార్ హీరోతో చేసేందుకు ఇప్పటికే పలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.తొందర్లోనే తన తదుపరి ప్రాజెక్టు వివరాలను కూడా అధికారికంగా వెల్లడిస్తానని తెలిపాడు.